News August 19, 2025
రేపు పార్లమెంట్లో J&K పునర్వ్యవస్థీకరణ బిల్లు!

జమ్మూకశ్మీర్కు తిరిగి రాష్ట్ర హోదా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈమేరకు రేపు పార్లమెంట్లో జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశపెట్టనుందని Republic TV తెలిపింది. హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లును ప్రవేశపెట్టి చర్చ మొదలుపెడతారని పేర్కొంది. కాగా J&Kకు రాష్ట్ర హోదా పునరుద్ధరణపై స్పందన తెలపాలని ఇటీవల కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Similar News
News March 31, 2026
మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర మరోసారి పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,030 పెరిగి రూ.1,49,290గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.950 ఎగబాకి రూ.1,36,850 పలుకుతోంది. ఇక వెండి ధర కేజీపై రూ.5వేలు తగ్గి రూ.2,50,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లోని ధరల్లో స్వల్ప తేడాలుంటాయి
News March 31, 2026
హార్ముజ్పై బిల్లుకు ఇరాన్ పార్లమెంటు ఆమోదం

హార్ముజ్ మీదుగా వెళ్లే నౌకలపై ఛార్జీలు విధించాలన్న ప్రతిపాదనకు ఇరాన్ పార్లమెంటు ఆమోదం తెలిపినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకు నిషేధం విధించిందని.. ఆంక్షలు విధించే ఇతర దేశాలకూ ఇది వర్తించనున్నట్లు పేర్కొంది. అయితే ఎంత చెల్లించాలి? ఇండియా ఈ లిస్ట్లో ఉందా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా భారత నౌకలకు ఇరాన్ ఎలాంటి ఛార్జ్ చేయట్లేదని కేంద్రం ఇటీవల పేర్కొంది.
News March 31, 2026
హార్ముజ్పై బిల్లుకు ఇరాన్ పార్లమెంటు ఆమోదం

హార్ముజ్ మీదుగా వెళ్లే నౌకలపై ఛార్జీలు విధించాలన్న ప్రతిపాదనకు ఇరాన్ పార్లమెంటు ఆమోదం తెలిపినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకు నిషేధం విధించిందని.. ఆంక్షలు విధించే ఇతర దేశాలకూ ఇది వర్తించనున్నట్లు పేర్కొంది. అయితే ఎంత చెల్లించాలి? ఇండియా ఈ లిస్ట్లో ఉందా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా భారత నౌకలకు ఇరాన్ ఎలాంటి ఛార్జ్ చేయట్లేదని కేంద్రం ఇటీవల పేర్కొంది.


