News August 20, 2025

IPL స్టార్స్‌ సుదర్శన్, ప్రసిద్ధ్‌కు బిగ్ షాక్

image

ఆసియా కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. కానీ ఐపీఎల్ 2025 ఆరెంజ్ క్యాప్ విన్నర్ సాయి సుదర్శన్, పర్పుల్ క్యాప్ విన్నర్ ప్రసిద్ధ్ కృష్ణకు చోటు కల్పించలేదు. ఐపీఎల్ ప్రామాణికంగా వీరిని ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసింది. కానీ టీ20 ఫార్మాట్‌లో జరిగే ఆసియా కప్ కోసం మాత్రం వారిని పట్టించుకోలేదు. కాగా గత సీజన్‌లో సుదర్శన్ 759 రన్స్ చేయగా ప్రసిద్ధ్ 25 వికెట్లు తీసి సత్తా చాటారు.

Similar News

News August 20, 2025

CM, PMను తొలగించే బిల్లు.. కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తోంది?

image

తీవ్ర నేరాల్లో అరెస్టై 30 రోజులకు మించి జైల్లో ఉన్న CM, PM, మంత్రులను తొలగించే <<17459052>>బిల్లును<<>> కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. విపక్షాలను అస్థిరపరిచేందుకే కేంద్రం ఈ బిల్లు తెచ్చిందని ఆరోపిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలతో అక్రమ అరెస్టులు చేయించి ప్రతిపక్షాల CMలు, మంత్రులను తొలగించే ప్రమాదముందని అంటోంది. ఎన్నికల్లో ఓడించలేక BJP వక్ర మార్గాలను అన్వేషిస్తోందని ఆక్షేపిస్తోంది. ఈ బిల్లు అవసరమేనా? COMMENT

News August 20, 2025

తిరుమల కొండపైకీ మహిళలకు ఉచిత ప్రయాణం

image

AP: తిరుమల కొండపైకి కూడా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ తెలిపారు. కానీ ఘాట్ రోడ్ కావడం వల్ల సిట్టింగ్ వరకు పర్మిషన్ ఇచ్చామన్నారు. ఒక్కో బస్సులో దాదాపు 50 మంది కూర్చుని ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. ఆస్పత్రులు, పుణ్యక్షేత్రాలు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లకు వెళ్లే మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పారు.

News August 20, 2025

RAJIV GANDHI: 40 ఏళ్లకే ప్రధానమంత్రి

image

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి నేడు. 1984లో 40 ఏళ్ల వయసులోనే రాజీవ్ PMగా బాధ్యతలు స్వీకరించారు. ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. తన హయాంలో టెక్నాలజీకి పెద్దపీట వేశారు. టెలీ కమ్యూనికేషన్స్, రక్షణ, వాణిజ్య, విమానయాన సంస్కరణలు ప్రవేశపెట్టారు. విద్యావకాశాల సమానత్వం కోసం నేషనల్ పాలసీ ఫర్ ఎడ్యుకేషన్‌ను తీసుకొచ్చారు. 1991 మే 21న జరిగిన ఆత్మాహుతి దాడిలో మరణించారు.