News August 20, 2025
విజయవాడ దుర్గమ్మ ఆలయంలో.. RMPనే పెద్ద వైద్యుడు!

రాష్ట్రంలో రెండో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో వైద్య సేవలు నామమాత్రంగా ఉన్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలాదిగా భక్తులు వస్తున్నా, వారికి వైద్యం అందించేందుకు ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో లేరు. కేవలం ఓ ఆర్ఎంపీ మాత్రమే సేవలు అందిస్తుండగా, ఉన్న ఒక్క అంబులెన్సులోనూ సౌకర్యాలు లేవు. దసరా ఉత్సవాలు సమీపిస్తున్నందున తక్షణం శాశ్వత వైద్యులను నియమించాలని కోరుతున్నారు.
Similar News
News March 27, 2026
సీతారాముల కళ్యాణంలో తలంబ్రాల విశిష్టత

భద్రాచలంలో సీతారాముల కళ్యాణంలో ముత్యాలు కలిపిన, గోటితో ఒలిచిన తలంబ్రాలను వధూవరులైన సీతారాములపై పోస్తారు. ఈ తలంబ్రాల తయారీలో ఉపయోగించే వరి ధాన్యాన్ని భక్తులు నియమనిష్టలతో పండించి నూర్పిడి చేసి వడ్లుగా మారుస్తారు. వీటిని గోటితో ఒలిచి బియ్యంగా మార్చి భద్రాచలానికి కాలినడకన వచ్చి అందిస్తారు. వీటికి బుక్కా, గులాలు, అత్తరు, పన్నీరు, ఆవునెయ్యిని కలుపుతారు. అందుకే ఈ కల్యాణ తలంబ్రాలు గులాబీ రంగులో ఉంటాయి.
News March 27, 2026
పనస కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పనస పండ్లను చెట్ల నుంచి కోసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. తొక్కపై కళ్లు పూర్తిగా విచ్చుకొని, లేత పసుపుపచ్చ రంగులోకి మారి వాసన వచ్చే కాయలనే కోయాలి. ఒకసారి కాసిన చోటే మరల కాసే గుణం పనసకు ఉంటుంది. కాబట్టి కాయలను కోసేటప్పుడు కొద్దిగా తొడిమను వదిలి కోయాలి. కోతకు వచ్చిన కాయలను పట్టుకొని గట్టిగా లాగినా, బెరడును గాయపరిచినా కాండం మీద మొగ్గలు దెబ్బతినే అవకాశం ఉంది.
News March 27, 2026
NTR: డబ్బులిస్తేనే సర్టిఫికెట్స్..!

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షా భవన్లో అధికారుల చేయి తడిపితే తప్ప సర్టిఫికెట్స్ ఇవ్వరనే ఆరోపణలొస్తున్నాయి. OD కోసం ఆన్లైన్లో అప్లై చేస్తే అది ఎప్పటికి వస్తుందో తెలియదు. కానీ అక్కడి సిబ్బందికి రూ.1,000కి పైగా ఇస్తే వెంటనే పని ఐపోతుంది. డబ్బులు ఇవ్వకపోతే PR పెండింగ్ అని రాసి పక్కన పడేస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. PR పెండింగ్ అంటే రికార్డ్స్ ఎక్కడున్నాయో చూడాలని అర్థం.


