News August 20, 2025
RAJIV GANDHI: 40 ఏళ్లకే ప్రధానమంత్రి

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి నేడు. 1984లో 40 ఏళ్ల వయసులోనే రాజీవ్ PMగా బాధ్యతలు స్వీకరించారు. ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. తన హయాంలో టెక్నాలజీకి పెద్దపీట వేశారు. టెలీ కమ్యూనికేషన్స్, రక్షణ, వాణిజ్య, విమానయాన సంస్కరణలు ప్రవేశపెట్టారు. విద్యావకాశాల సమానత్వం కోసం నేషనల్ పాలసీ ఫర్ ఎడ్యుకేషన్ను తీసుకొచ్చారు. 1991 మే 21న జరిగిన ఆత్మాహుతి దాడిలో మరణించారు.
Similar News
News August 20, 2025
వన్డే ర్యాంకింగ్స్లో రోహిత్, కోహ్లీ పేర్లు మిస్సింగ్!

ICC వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో రోహిత్, కోహ్లీ పేర్లు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. వారం క్రితం రోహిత్ 2, కోహ్లీ 4వ స్థానాల్లో ఉన్నారు. తాజా ర్యాంకింగ్స్లో TOP-100లో కూడా లేరు. దీనికి టెక్నికల్ గ్లిచ్ కారణమా లేదా వారి రిటైర్మెంట్కు సంకేతమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూల్ ప్రకారం 9-12 నెలలు ODIs ఆడకపోతే ర్యాంకింగ్స్ నుంచి తొలగిస్తారు. చివరిగా వీరిద్దరూ 2025 మార్చిలో (CT) ODIs ఆడారు.
News August 20, 2025
అలా చేస్తే ఊరుకునేది లేదు: బీఆర్ నాయుడు

AP: తిరుమలలో తప్పు చేస్తే మాట్లాడాలని, లేని పోని విమర్శలు సరికాదని TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తప్పు చేయకుండా ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు. తిరుమల వచ్చి తలనీలాలు సమర్పించి జగన్, భారతి ప్రసాదాలు తింటారా? ప్రతి చిన్న విషయాన్ని కావాలనే పెద్దది చేసి తిరుమలపై విమర్శలు చేస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి TTD ప్రతిష్ఠను దెబ్బతీయడమే పనిగా పెట్టుకున్నారు’ అని ఆయన మండిపడ్డారు.
News August 20, 2025
త్వరలో మోదీ-పుతిన్-జిన్పింగ్ భేటీ!

రష్యా-భారత్-చైనా మధ్య సంబంధాలు బలపడాల్సిన అవసరముందని భారత్లోని రష్యన్ అంబాసిడర్ రోమన్ బాబుష్కిన్ అభిప్రాయపడ్డారు. ఆసియాలోని 3 అతిపెద్ద దేశాలు ఒకేతాటిపైకి రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. త్రైపాక్షిక(మోదీ-పుతిన్-జిన్పింగ్) సమావేశం ఎప్పుడన్న ప్రశ్నకు ‘అతి త్వరలో.. సరైన సమయం కోసం వేచి చూడాలి’ అని స్పందించారు. US టారిఫ్స్ దృష్ట్యా ఆయిల్పై భారత్కు రష్యా మరో 5% డిస్కౌంట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.