News August 20, 2025
మెగా డీఎస్సీ.. ఎంపికైన అభ్యర్థులకే సమాచారం!

APలో 16,347 DSC పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరు కావాలని విద్యాశాఖ సమాచారం పంపింది. ప్రభుత్వం ప్రకటించిన తేదీల్లో వెరిఫికేషన్కు హాజరుకావాలని తెలిపింది. అటు ధ్రువపత్రాల పరిశీలనకు అధికారులతో ప్రత్యేక బృందాలను నియమించనుంది. ఈ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించింది. త్వరలోనే ఈ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. SEP 5లోగా కొత్త టీచర్లకు పోస్టింగ్స్ ఇచ్చేలా కసరత్తు చేస్తోంది.
Similar News
News August 20, 2025
ప్రైవేటు విద్యాసంస్థల్లో రిజర్వేషన్ తేవాలి: కాంగ్రెస్

SC, ST, OBC విద్యార్థులకు ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్స్ కల్పించేలా కేంద్రం చట్టం చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. స్టాండింగ్ కమిటీ సిఫార్సు మేరకు SC విద్యార్థులకు 15%, STలకు 7.5%, OBCలకు 27% రిజర్వేషన్ కల్పించాలని కోరింది. ‘ప్రస్తుతం బంతి కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉంది. ఇకపై SC, ST, OBCల డిమాండును కేంద్రం తోసిపుచ్చలేదు’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ పేర్కొన్నారు.
News August 20, 2025
అగ్ని-5 బాలిస్టిక్ మిస్సైల్ పరీక్ష విజయవంతం

ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ అగ్ని-5ను భారత్ విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ శాఖ ప్రకటించింది. ఒడిశా చందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి మిస్సైల్ను పరీక్షించారు. ఈ లాంఛ్ అన్ని ఆపరేషనల్, టెక్నికల్ పారామీటర్స్ను రీచ్ అయినట్లు పేర్కొంది. స్ట్రాటజిక్ ఫోర్సెస్ ఆధ్వర్యంలో ఈ పరీక్షను నిర్వహించారు. ఇది ఇండియన్ ఆర్మీకి బిగ్గెస్ట్ అసెట్ కానుందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
News August 20, 2025
సినీ రంగంలోనూ AI ప్రభావం.. నటీనటులకు గడ్డుకాలమేనా?

ఉద్యోగుల్లో భయాన్ని రేకెత్తిస్తోన్న AI ఇప్పుడు సినీ ఫీల్డ్నూ తాకింది. ఇప్పటికే పూర్తిగా ఏఐ ద్వారా రూపొందించిన ‘మహావతార్ నరసింహ’ చిత్రం భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో నటీనటులు లేకపోయినా భావోద్వేగాలను సృష్టించొచ్చు అని ఇది నిరూపించింది. ఈక్రమంలో ఏఐతో సినిమాలు తీయడంపై బాలీవుడ్ దృష్టి పెడుతోంది. రామాయణ్, చిరంజీవి హనుమాన్ వంటి చిత్రాలను ఏఐతో రూపొందిస్తోంది. దీనిపై మీ కామెంట్?