News August 20, 2025
అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి పెరుగుతుండటంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. జిల్లా కలెక్టర్తో పాటు అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News March 16, 2026
అనకాపల్లి టెన్త్ విద్యార్థులారా.. మీకు ఫ్రీ బస్

జిల్లాలో పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఉచితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా శాఖ (ఆర్టీసీ అధికారిణి) వి.ప్రవీణ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం నుంచి విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని అన్నారు. పల్లె వెలుగు, ఆల్ట్రా డీలక్స్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో అవకాశాన్ని వినియోగించుకోవచ్చునని పేర్కొన్నారు.
News March 16, 2026
ఆగిన ఎగుమతులు.. కుప్పకూలిన అరటి ధరలు

AP: పశ్చిమాసియాలో యుద్ధంతో అరటి రైతులు కుదేలవుతున్నారు. గల్ఫ్ దేశాలకు ఎగుమతులు ఆగిపోవడంతో 2 వారాల్లోనే వారి జీవితాలు తలకిందులయ్యాయి. ఈ నెల ఆరంభంలో టన్ను ధర రూ.20-23వేలు ఉండగా ప్రస్తుతం రూ.6-8వేలకు పడిపోయింది. స్థానికంగానూ కొనడానికి వ్యాపారులు ముందుకు రావట్లేదని అన్నదాతలు వాపోతున్నారు. వార్ ఇలాగే కొనసాగితే రేట్లు మరింత పతనమవుతాయని అంచనా. రాయలసీమలో దాదాపు లక్ష ఎకరాల్లో అరటి సాగవుతుంది.
News March 16, 2026
మన్యం: ఇప్ప పువ్వు.. ఆదివాసీలకు ఆదాయ వనరు

పార్వతీపురం మన్యం జిల్లాలో ఆదివాసీ గ్రామాల్లో ఇప్ప పువ్వుల సేకరణ జోరుగా సాగుతోంది. అడవుల్లో లభించే ఈ పువ్వులను గ్రామస్థులు ఫిబ్రవరి నుంచి మే నెలవరకు సేకరించి ఎండ బెట్టి అమ్ముతుంటారు. ఈ పువ్వుల పూజా కార్యక్రమాల్లో వినియోగిస్తుంటారు. ఈ ఇప్ప పువ్వును ఆదివాసీ గ్రామాల్లో ముఖ్యమైన ఆదాయ వనరులుగా భావిస్తారు.


