News August 20, 2025
పోడు భూముల్లో ప్రకృతి వ్యవసాయం

పాచిపెంట మండలం కుడుమూరు ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూముల్లో పకృతి వ్యవసాయ పద్ధతిలో వరి పంట పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ ప్రాంత ప్రజలు. సుమారు 15 పంచాయతీలు ప్రజలు పోడు వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కొండలపై తుప్పలు తొలిగించి వ్యవసాయం చేస్తుంటారు. గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాలకు వరి పైరు మొత్తం పచ్చగా మారి ఆ ప్రాంతం అరకును తలపిస్తోంది.
Similar News
News April 6, 2026
నీలాదేవి భక్తికి మెచ్చిన శ్రీవారు..

అలా నీలాదేవి స్వామి వారికి తన వెంట్రుకలతో కట్టుకట్టడంతో ఆమె భక్తికి శ్రీవారు మెచ్చారు. తన దర్శనానికి విచ్చే భక్తులు తనపై భక్తి భావంతో సమర్పించే తలనీలాలు నీలాకే చెందుతాయని వరం ఇచ్చారట. కలియుగాంతం వరకూ నీలా దేవికి వెంట్రుకలు తొలగించబడిన స్థానంలో తిరిగి మొలుస్తాయని స్వామివారు పేర్కొన్నారట. ఆనాటి నుంచి నేటి వరకూ తిరుమల క్షేత్రంలో నిరంతరాయంగా తలనీలాల సమర్పణ కొనసాగుతుందని ఆగమ పండితులు అంటున్నారు.
News April 6, 2026
GVMCలో 79 గ్రామ పంచాయతీల విలీనం లేనట్టే..!

విశాఖ జిల్లాలోని భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి మండలాల 79 గ్రామ పంచాయతీలను GVMCలో విలీనం చేసే ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పటికే జిల్లాలో 89% పట్టణ, 11% గ్రామీణ ప్రాంతం ఉంది. ఈ 4 మండలాల్లో సుమారు 4-5 లక్షల జనాభా కలరు. 2027 జనాభా గణన తర్వాతే పునర్విభజనకు అవకాశం ఉండటంతో అప్పటివరకు విలీనం ప్రతిపాదనలు అటకెక్కినట్టే తెలుస్తోంది.
News April 6, 2026
పిరికివాడి మనస్తత్వం ఇలా ఉంటుంది!

మేడిపండు చూడ మేలిమై యుండును
పొట్ట విచ్చి చూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: మేడిపండు చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. కానీ దాన్ని కోసి చూస్తే పురుగులు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే పిరికివాడు పైకి చాలా ధైర్యంగా, గొప్పగా మాట్లాడుతాడు. కానీ మనసులో భయంతో నిండి ఉంటాడు.
<<-se>>#PADHYAM<<>>


