News August 20, 2025
వనపర్తి: 40.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

వనపర్తి జిల్లాలో 24 గంటల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది. ఘనపూర్లో 40.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సీపీఓ భూపాల్ రెడ్డి తెలిపారు. అమరచింతలో 21.2 మి.మీ, మదనాపూర్లో 12.2, పెద్దమందడిలో 16.8, గోపాల్పేటలో 27.4, రేవల్లిలో 22.4, పానగల్లో 13.8, వనపర్తిలో 22.6, కొత్తకోటలో 14.6, ఆత్మకూరులో 6.6, పెబ్బేరులో 6.8, శ్రీరంగాపూర్లో 8.4, వీపనగండ్లలో 10.4, చిన్నంబావిలో 9.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
Similar News
News August 20, 2025
గంబీరావుపేట: వరద ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ

గంభీరావుపేట, లింగన్నపేట మధ్య వరద ప్రవాహం పెరిగి రాకపోకలకు అంతరాయం కలగడంతో SP మహేష్ బి. గితే పరిశీలించారు. SI రమాకాంత్తో మాట్లాడిన ఎస్పీ, వరద ప్రవాహంలోకి ఎవరూ వెళ్లకుండా ఇరువైపులా బారికేడ్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చోట్ల పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని, వరద నివారణకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
News August 20, 2025
గంభీరావుపేట: ‘పాడి పశువులను సద్వినియోగం చేసుకోవాలి’

పాడి పశువులను సద్వినియోగం చేసుకొని పేద కుటుంబాలు ఆర్థికంగా వృద్ధి చెందాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్షించారు. గంభీరావుపేట మండలం దేశాయిపల్లి గ్రామంలోని ప్రగతిభవన్ లో 17 మంది ఎస్సీ లబ్దిదారులకు ఒక్కరికి 2 చొప్పున మొత్తం 34 పాడి పశువులను కలెక్టర్ బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పంపిణీ చేసే పశువులు డెలీవరి తర్వాత 12 నుంచి 15 లీటర్ల పాలు ఇస్తుందన్నారు.
News August 20, 2025
ముస్తాబాద్: ‘విరుద్ధంగా డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు’

నిబంధనలకు విరుద్ధంగా డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల SP మహేష్ బి గీతే అన్నారు. ముస్తాబాద్లోని పోలీస్ స్టేషన్ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసుల దర్యాప్తు విషయంలో ఎలాంటి అలసత్వం వహించద్దని సూచించారు. ఫిర్యాదుల పట్ల తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను ప్రతిరోజు తనిఖీ చేయాలని ఆదేశించారు.