News August 20, 2025
భారీగా పెరిగిన టమాటా ధరలు

తెలుగు రాష్ట్రాల్లో టమాటా రేట్లు భారీగా పెరిగాయి. TGలోని HYD సహా జిల్లాల్లో నాణ్యమైన టమాటా కేజీ రూ.60-70 వరకు పలుకుతోంది. హోల్సేల్గా కేజీ రూ.40-50 వరకు ఉంది. అటు ఏపీలో విజయవాడ, విశాఖ వంటి నగరాల్లో కేజీ రూ.50-60గా ఉండగా జిల్లాల్లో రూ.35-45 వరకు పలుకుతోంది. అతిభారీ వర్షాలు, వరదలతో టమాటా పంట తీవ్రంగా దెబ్బతింది. మార్కెట్లకు సరఫరా గణనీయంగా తగ్గడంతో రేట్లు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
Similar News
News August 21, 2025
నూజివీడు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం

నూజివీడులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో ఖాళీగా ఉన్న ట్రేడ్లలో అడ్మిషన్లకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రజిత బుధవారం తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 21 నుంచి 26 సాయంత్రం 5 గంటల్లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు కళాశాలలో సంప్రదించాలని పేర్కొన్నారు.
News August 21, 2025
నేటి ముఖ్యాంశాలు

⋆ లోక్సభలో మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్రం
⋆ జైలుకెళ్లిన మంత్రుల తొలగింపు బిల్లుపై సభలో దుమారం
⋆ ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి
⋆ భవిష్యత్తులో 21 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం: CM రేవంత్
⋆ పేదలకు ఇళ్లు.. స్థలాలు గుర్తించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు
⋆ కర్నూలు జిల్లాలో ఈతకు వెళ్లి ఆరుగురు మృతి
⋆ మరో ప్రీపెయిడ్ ప్లాన్ను తొలగించిన జియో
News August 21, 2025
AP న్యూస్ రౌండప్

* కర్నూలు (D)లో <<17465047>>చిన్నారుల మృతి<<>> పట్ల CM చంద్రబాబు సంతాపం, జగన్ దిగ్భ్రాంతి
* విద్యాశాఖకు కేంద్రం అదనంగా రూ.432.19CR కేటాయింపు
* నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు పీపీలు, 15మంది ఏపీపీలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న లాయర్లపై ప్రభుత్వం వేటు
* PRC, డీఏలపై వెంటనే ప్రకటన చేయాలి: APNGO అధ్యక్షుడు విద్యాసాగర్
* అప్పులు తీరాక వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు: బొత్స