News August 20, 2025
విశాఖలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం

మంగళగిరి మయూరి టెక్ పార్కు నుంచి వర్చువల్గా విశాఖలోని డెక్ భవనంలో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను సీఎం నారా చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 12, 2026
ఖమ్మం: కావూరి సాంబశివరావుకు అంతిమ వీడ్కోలు

మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మనవడు ఎంపీ శ్రీ భరత్తో పాటు కావూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, మధు యాష్కీ గౌడ్ తదితర ప్రముఖులు పాల్గొని నివాళులు అర్పించారు.
News March 12, 2026
జిల్లాలో గ్యాస్ కొరత లేదు: తూ.గో కలెక్టర్

తూ.గో జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. నిత్యం గృహ వినియోగదారులు, హాస్టళ్లు, ఆసుపత్రులకు 11 వేల సిలిండర్లు సరఫరా అవుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో 14,829 సిలిండర్లు స్టాక్గా అందుబాటులో ఉన్నాయన్నారు. IOC, HPC, BPC ద్వారా సరఫరా సజావుగా సాగుతోందని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.
News March 12, 2026
క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారమే లక్ష్యం: కలెక్టర్

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ B.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై దృష్టి సారించాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని, మున్సిపల్ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.


