News August 20, 2025

వాస్తు పేరుతో ఇంద్రకీలాద్రిలో కోట్లు స్వాహా?

image

విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్నాయి. సుమారు 2-3 లక్షల మంది వస్తారు. ప్రసాద భవనం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఓ ఇంజినీరింగ్ అధికారి, ఆలయ ఆస్థాన విధ్వాంసుడి నిర్వాకం వల్ల శాశ్వత భవనాలు నిర్మించలేదని ఆరోపణలున్నాయి. నిర్మాణాలు చేపట్టి వాస్తు దోషం పేరిట కూల్చివేయడం వల్ల కోట్లు దండుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Similar News

News March 26, 2026

పొట్టేళ్లకు ఎండు మేత చాలా ముఖ్యం

image

పొట్టేళ్ల పెంపకంలో పచ్చి మేత కంటే ఎండు మేతే చాలా ముఖ్యమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. వేరుశనగ పొట్టు, ఉలవ పొట్టు, కంది పొట్టు వంటి చాలా రకాల ఎండు మేతలు అందుబాటులో ఉన్నాయి. వీటిని పొట్టేళ్లు చాలా ఇష్టంగా తింటాయి. దీని వల్ల అవి చాలా ఆరోగ్యంగా ఉంటూ, ఎక్కువ బరువు పెరుగుతాయి. అందుకే పచ్చిమేత కాస్త తక్కువైనా, ఎండు మేతను వెటర్నరీ నిపుణుల సూచనలతో సరైన పరిమాణంలో అందేలా చూసుకోవాలి.

News March 26, 2026

PDPL: అడ్డదారిలో పోస్టింగ్లు.. ఎంక్వైరీకి ఆదేశం..!

image

సింగరేణి కారుణ్య నియామకాల్లో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ACB, విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించినట్లు సమాచారం. 2014- 25 మధ్యకాలంలో 15,109 మంది కార్మికులు ఇన్వాలిడేషన్ పొందారు. కార్మికులు ఆరోగ్యంగా ఉన్నా విధులకు అనర్హులుగా గుర్తిస్తూ మెడికల్ ఇన్వాలిడేషన్ ఇవ్వడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఉద్యోగ విరమణ తీసుకోవాల్సినవారు వారసులకు ఉద్యోగాలు కల్పించడంతో ఆర్థిక భారం పడుతుందని గుర్తించింది.

News March 26, 2026

మార్కాపురం ప్రమాదంపై మంత్రి నారాయణ తీవ్ర విచారం

image

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై మంత్రి నారాయణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బస్సులో ప్రయాణికులు సజీవ దహనం కావడం అత్యంత విషాదకరమని అన్నారు. జిల్లా అధికారులతో మాట్లాడిన ఆయన, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదంలో నెల్లూరు జిల్లా వాసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.