News April 1, 2024
పలాసలో గెలుపు ఎవరికో?

AP: పలాస నియోజకవర్గం(శ్రీకాకుళం) 2008లో ఏర్పడింది. 2009లో జగన్నాయకులు(INC), 2014లో గౌతు శివాజీ(TDP), 2019లో సీదిరి అప్పలరాజు(YCP) ఎన్నికయ్యారు. ఈసారి YCP నుంచి సీదిరి, TDP నుంచి గౌతు శిరీష బరిలో దిగుతున్నారు. ఉద్ధానంలో మంచినీటి ప్రాజెక్టు, కిడ్నీ సెంటర్ తనను గెలిపిస్తాయని సీదిరి ధీమాగా ఉన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత, తమ ఫ్యామిలీకి ఉన్న మంచి పేరు కలిసొస్తుందని శిరీష భావిస్తున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News March 18, 2026
Way2News ప్రజాగళం.. వాట్సాప్ నంబర్ సేవ్ చేసుకోండి!

ప్రజా గొంతుకగా Way2News నిలుస్తోంది. మీ గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నెలకొన్న ప్రజా సమస్యలు, అక్రమాలు, అవినీతి, భూకబ్జాలు, ఇతర మోసాలపై మీరు ఎప్పటికప్పుడు Way2News ప్రజాగళం TG వాట్సాప్ నంబర్ 7995975252కు ఫొటోలు, వీడియోలతో కూడిన సమాచారాన్ని పంపించవచ్చు. వాటిని ప్రభుత్వ యంత్రాంగానికి తెలిసేలా పబ్లిష్ చేసి, పరిష్కారానికి కృషి చేస్తాం.
గమనిక: ఈ నంబర్ వాట్సాప్కు మాత్రమే, ఫోన్ కాల్ పనిచేయదు.
News March 18, 2026
ఆ కళ్లద్దాలతో న్యూడ్, బెడ్రూమ్ దృశ్యాలు రికార్డ్!

మెటా AI స్మార్ట్ గ్లాసెస్ వినియోగదారుల అత్యంత వ్యక్తిగత దృశ్యాలను రికార్డ్ చేసి కెన్యాలోని రివ్యూయర్లకు పంపిస్తున్నట్లు స్వీడిష్ పత్రికల ఇన్వెస్టిగేషన్లో తేలింది. దాని ప్రకారం.. న్యూడ్, బెడ్రూమ్, బాత్రూమ్ దృశ్యాలతో పాటు బ్యాంక్ కార్డుల వివరాలు అక్కడి సిబ్బందికి చేరుస్తున్నాయి. బ్లర్ చేసే టెక్నాలజీ పనిచేయక వ్యక్తుల ముఖాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో మెటాపై క్లాస్ యాక్షన్ దావా నమోదైంది.
News March 18, 2026
అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్

TG: మూసీ ప్రాజెక్టు అంశంపై అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటలయుద్ధం జరిగింది. మూసీ గురించి సభలో ప్రభుత్వం అన్నీ అబద్ధాలే చెబుతోందని KTR మండిపడ్డారు. సర్కార్ వైఖరికి నిరసనగా వాకౌట్ చేస్తున్నామంటూ ఆ పార్టీ సభ్యులతో కలిసి బయటికి వెళ్లిపోయారు. అయితే BRSకు మూసీ ప్రాజెక్టు విషయంలో చిత్తశుద్ధి లేదని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశమే వారికి లేదన్నారు.


