News August 20, 2025
సుల్తానాబాద్: ‘రోగులకు మెరుగైన సేవలు అందించాలి’

సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి, పీఏసీఎస్ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించాలని, ప్రసవాల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్తగా కొనుగోలు చేసిన రూ.12.50 లక్షల విలువైన అల్ట్రాసౌండ్, ఎన్ఎస్టీ యంత్రాలను ఆయన ప్రారంభించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News March 19, 2026
BREAKING: జాబ్ క్యాలెండర్ విడుదల

AP: 10,060 పోస్టులతో మంత్రి లోకేశ్ <<19422647>>జాబ్ క్యాలెండర్<<>> విడుదల చేశారు. ఉగాది కానుకగా ఉద్యోగాల పండగ ప్రకటిస్తున్నామని తెలిపారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు. ఉద్యోగార్థులందరూ ‘<
News March 19, 2026
16.7L మె.టన్నుల క్రూడ్ నిలిచిపోయింది: కేంద్రం

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారతీయ జెండా ఉన్న 22 నౌకలు పర్షియన్ గల్ఫ్ సముద్ర జలాల్లో చిక్కుకుపోయాయని నౌకాయాన మంత్రిత్వ శాఖ స్పెషల్ సెక్రటరీ రాజేశ్ కుమార్ సిన్హా వెల్లడించారు. ఇందులో 16.7L మె.టన్నుల క్రూడాయిల్, 3.2L మె.టన్నుల LPG, 2L మె.టన్నుల LNG ఉన్నాయని తెలిపారు. ఈ నౌకల్లోని 611 మంది ఇండియన్ నావికులు సురక్షితంగా ఉన్నారన్నారు. అన్ని దేశాలకు చెందిన దాదాపు 500 నౌకలు ఆగిపోయాయని పేర్కొన్నారు.
News March 19, 2026
ఏలూరు జిల్లా నుంచే పసిపిల్లల విక్రయాలు.. జనసేన నేత కీలక పాత్ర (1/3)

కైకలూరు నియోజకవర్గం పసిపిల్లల విక్రయాలకు కేంద్రంగా మారింది. ఈ విక్రయాల్లో ముదినేపల్లి, సింగరాయపాలెం గ్రామాలకు చెందిన వ్యక్తులన్నారు. ఒక మండల జనసేన నాయకుడు, అతని తల్లి కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరికి మరో గ్రామానికి చెందిన జనసేన చోటా నాయకుడు, ఏలూరులో ప్రైవేట్ ఆసుపత్రి నిర్వహిస్తున్న వైద్య దంపతులు సహకరిస్తున్నారు. వారి ఆసుపత్రిలో పని చేసే నర్సుల ఫోన్ పే ద్వారా నగదు లావాదేవీలు నిర్వహిస్తున్నారు.


