News August 20, 2025

భద్రాద్రి: BRS మహిళా నేత కుటుంబానికి KCR రూ.5 లక్షల సాయం

image

దమ్మపేట మండలానికి చెందిన తెలంగాణ ఉద్యమకారిణి, BRS నాయకురాలు తూత నాగమణి దశదిన కర్మలో MLC తాతా మధు, మాజీ MLAలు రేగా కాంతారావు, మెచ్చా నాగేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగమణి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం BRS అధినేత KCR, KTRల తరఫున నాగమణి కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేశారు. తెలంగాణ ఉద్యమంలో నాగమణి చేసిన కృషిని నాయకులు కొనియాడారు.

Similar News

News March 23, 2026

ప్రతి పంచాయతీ అంకాపూర్‌లాగా అభివృద్ధి చెందాలి: సీఎం

image

రైతులు లాభసాటి వ్యవసాయంపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ సూచించారు. ఆదివారం సిద్దిపేట(D) నర్మెట సభలో మాట్లాడారు. రైతులు మిల్లెట్స్ ఆర్గానిక్, కాయగూరలు, ఆకుకూరలు, ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలన్నారు. పామాయిల్ సాగు లాభదాయకని, ఆదాయం పెరుగుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి పంచాయతీ అంకాపూర్‌లాగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రతి రైతు కారు కొనుక్కునేలా లాభసాటి వ్యవసాయం చేస్తూ ఆదాయం పెంచుకోవాలన్నారు.

News March 23, 2026

మూలపేట పోర్టుపై రాజకీయ వేడి

image

శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో కీలకమైన మూలపేట పోర్టు పనుల్లో డొల్లతనం కనిపిస్తోందని కూటమిపై వైసీపీ విమర్శలు చేస్తోంది. అయితే ఇటీవల పోర్టుకు రోడ్డు, రైలు అనుసంధానానికి కేంద్రం 358 ఎకరాల భూమిని కేటాయించింది. ఇది అభివృద్ధికి పెద్ద పీఠం ఇవ్వనుందని కూటమి పేర్కొనగా..YCP నిర్మాణాలు చకచక జరగడం లేదని MAR30న పోర్టు సందర్శన కార్యక్రమం నిర్వహించనుంది. దీంతో జిల్లాలో అభివృద్ధి పేరుతో రాజకీయ వేడి రాజుకుంటోంది.

News March 23, 2026

HYD: ముంచుకొస్తోంది.. జర జాగ్రత్త!

image

వేసవి దృష్ట్యా HYDలో ఒక్కపూట బడులు సాగుతున్నాయి. ఈ గ్యాప్‌లో పిల్లలు సరదాగా ఈతకు వెళ్తుంటారు. ఒక్కోసారి ఈసరదా వెంటే విషాదం పొంచి ఉండే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. హైదరాబాదీలు గతేడాది 8 మంది లోతు తెలియక, ప్రవాహ తాకిడికి మునిగిపోయారు. వేసవిలో రోజుకు నలుగురి చొప్పున ఈత సరదాకు బలయ్యారని గణాంకాలు చెబుతున్నాయి. పెద్దలు, నిపుణుల సమక్షంలో పిల్లలకు ఈత నేర్పండి.