News August 20, 2025

ఈ నెల 23న ఖాతాల్లోకి డబ్బులు

image

AP: గతంలో నిలిచిపోయిన జాతీయ ఉపాధి హామీ పథకం పెండింగ్‌ బిల్లులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014-19 మధ్య జరిగిన పనుల బిల్లులను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. పనులు చేసిన ఉపాధి హామీ శ్రామికుల ఖాతాల్లో ఈ నెల 23న రూ.145 కోట్లు జమ చేయనుంది.

Similar News

News March 12, 2026

కాకినాడ ఆదిత్య యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు

image

కాకినాడ జిల్లా సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్సిటీలో ECE, CSE, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ తదితర విభాగాల్లో ప్రొఫెసర్‌, అసోసియేట్ ప్రొఫెసర్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. చివరితేదీ: మార్చి 15, వెబ్‌సైట్: <>https://adityauniversity.in/careers<<>>

News March 12, 2026

UPSCపై వివాదం.. ఇంటర్వ్యూలో పక్షపాతం?

image

UPSC సివిల్స్‌లో రిజర్వ్‌డ్ క్యాండిడేట్స్‌కు అన్యాయం జరుగుతోందంటూ SMలో చర్చ జరుగుతోంది. మెయిన్స్‌లో మంచి మార్కులు సాధించినా.. ఇంటర్వ్యూలో తక్కువ స్కోర్ వస్తున్నట్లు ఓ వర్గం ఆరోపిస్తోంది. ఇది ఇంటర్వ్యూ బోర్డు పక్షపాతం వల్లే అంటోంది. మెయిన్స్‌లో టాప్ మార్కులు వచ్చిన ఓ రిజర్వ్‌డ్ క్యాండిడేట్‌కు ఇంటర్వ్యూలో 60/275 మార్కులే వచ్చినట్లు ఉదహరిస్తోంది. దీన్ని మరో వర్గం మాత్రం కొట్టిపారేస్తోంది.

News March 12, 2026

పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లు.. ఉత్తర్వులు జారీ

image

AP: సర్పంచ్‌ల పదవీ కాలం APR 2తో ముగియనుంది. దీంతో గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారులను నియమించాలని కలెక్టర్లను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. MRO, MPDO, MEO, డిప్యూటీ MPDO, వీరి కంటే ఎక్కువ హోదా కలిగిన వారిని స్పెషల్ ఆఫీసర్లుగా నియమించాలని సూచించింది. కొత్త సర్పంచ్‌లు బాధ్యతలు చేపట్టేవరకు వీరు పాలన కొనసాగించాలంది. రాష్ట్రంలో 13,100 గ్రామ పంచాయతీలు ఉన్న విషయం తెలిసిందే.