News August 20, 2025

దాడి తర్వాత షాక్‌కు గురయ్యా: CM రేఖా గుప్తా

image

తనపై జరిగిన దాడి విషయంపై ఢిల్లీ సీఎం <<17460103>>రేఖా గుప్తా<<>> స్పందించారు. ‘దాడి జరగగానే షాక్‌కు గురయ్యా. ఇప్పుడు తేరుకున్నాను. ఇది ఢిల్లీకి సేవ చేయాలనే మా సంకల్పంపై జరిగిన పిరికిపంద చర్య. ప్రజలకు సేవ చేయాలనే నా స్ఫూర్తిని ఇలాంటి దాడులు ఆపలేవు. త్వరలోనే ప్రజల ముందుకు వస్తాను. ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం మునుపటిలాగానే కొనసాగుతాయి. ప్రజల మద్దతే నాకు కొండంత బలం’ అని Xలో పోస్ట్ చేశారు.

Similar News

News August 21, 2025

ఇలా చేసి కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు!

image

రోజుకు కనీసం 2.5-3లీటర్ల నీటిని తాగితే కిడ్నీల ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ‘ఉప్పు, ప్రాసెస్డ్&ఆయిల్ ఫుడ్, మాంసాహారాన్ని పరిమితం చేయాలి. సాధ్యమైనంత వరకు పెయిన్ కిల్లర్స్ వాడకం తగ్గించాలి. వ్యాయామం, తగిన నిద్ర, మానసిక ప్రశాంతత అవసరం. మూత్ర విసర్జన ఆపుకోకూడదు. శరీర బరువు పెరిగితే బీపీ, షుగర్ వచ్చే అవకాశముంది. ఈ రెండూ కిడ్నీల డ్యామేజ్‌కు ప్రధాన కారణాలు’ అని చెబుతున్నారు. SHARE IT.

News August 21, 2025

PLEASE CHECK: అకౌంట్లలో డబ్బులు పడ్డాయా?

image

AP: ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ వల్ల ‘అన్నదాత సుఖీభవ’ లబ్ధి పొందని 1,04,107 మంది రైతుల ఖాతాల్లో నిన్న డబ్బులు జమ అయ్యాయి. వారితో పాటు ఈ-కేవైసీ, NPCI క్రమబద్ధీకరించుకున్న మరో 38,658 మందికి రూ.5వేల చొప్పున మంత్రి అచ్చెన్నాయుడు రూ.71.38 కోట్లు విడుదల చేశారు. ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయో? లేదో? ఈ <>వెబ్‌సైట్‌లో<<>> చెక్ చేసుకోవచ్చు. రైతు ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

News August 21, 2025

ఆన్‌లైన్ గేమ్స్‌తో రూ.20 వేల కోట్లు గుల్ల!

image

మన దేశంలో ఏటా ప్రజలు ఆన్‌లైన్ గేమ్స్ ఆడి రూ.20,000 కోట్లు పోగొట్టుకుంటున్నట్లు సమాచారం. యాప్‌లు, వెబ్‌సైట్లకు యువత బానిసగా మారుతోంది. కొన్ని రాష్ట్రాల్లో నిషేధం ఉన్నా ఫేక్ లొకేషన్లతో ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నారు. బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకున్నవారు అడ్డదారులు తొక్కుతున్నారు. దోపిడీ, దొంగతనాలతోపాటు సిగరెట్లు, మద్యం, డ్రగ్స్‌కు కూడా అలవాటు పడుతున్నారు. డబ్బుల కోసం తల్లిదండ్రులను పీడిస్తున్నారు.