News August 20, 2025
జియో యూజర్లకు మరో షాక్

జియో సంస్థ మరో ప్రీపెయిడ్ ప్లాన్ను తొలగించింది. రూ.799తో 84 రోజులపాటు అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 1.5 GB డేటా, 100 SMSలు అందించే ప్లాన్ను రద్దు చేసింది. ఇక నుంచి ఈ సేవలు కావాలనుకుంటే యూజర్లు రూ.889తో రీఛార్జ్ చేసుకోవాలి. రూ.889 ప్లాన్లో జియో సావన్ ప్రో, జియో టీవీ, జియో క్లౌడ్ సబ్స్క్రిప్షన్లు ఉచితంగా లభిస్తాయి. కాగా రెండు రోజుల క్రితం రూ.249 ప్లాన్ను జియో తొలగించిన సంగతి తెలిసిందే.
Similar News
News March 17, 2026
బిల్లులో గ్యాస్ ఛార్జ్.. రూల్స్ ఏం చెబుతున్నాయి?

హోటల్ బిల్లులో ఫుడ్ ప్రైస్, GST తప్ప మరే ఇతర ఛార్జీలు వసూలు చేయడానికి వీల్లేదని వినియోగదారుల రక్షణ చట్టం (2019) చెబుతోంది. ఇటీవల ‘గ్యాస్ క్రైసిస్ ఛార్జ్’ పేరుతో అదనంగా వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సర్వీస్ ఛార్జ్ అయినా, మరే ఇతర పేరుతో అయినా కస్టమర్ అనుమతి లేకుండా ఎక్స్ట్రా డబ్బులు అడగొద్దు. పెరిగిన ఖర్చులను మెనూ ధరల్లో చూపించాలే తప్ప విడిగా యాడ్ చేయడం రూల్స్కు విరుద్ధం.
News March 17, 2026
ఈ జీవి పాలు నల్లగా ఉంటాయ్.. ఎందుకంటే?

సాధారణంగా ఏ జీవి పాలైనా తెలుపు రంగులో ఉంటాయి. కానీ ఖడ్గమృగం మాత్రం నల్లటి పాలు ఇస్తుంది. వీటిలో కొవ్వు శాతం చాలా తక్కువగా(0.2%) ఉండటమే దీనికి కారణం. ఇతర జంతువుల పాలలో కొవ్వు ఎక్కువగా ఉండి తెల్లగా కనిపిస్తాయి. కానీ ఖడ్గమృగం పాలలో నీరు ఎక్కువగా ఉండి కొవ్వు తక్కువగా ఉండటంతో అవి నల్లగా ఉంటాయి. ఇందులో అనేక పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో
News March 17, 2026
IPLలో అత్యధిక పరుగుల వీరులు వీరే..

విరాట్ కోహ్లీ-8661 (267 మ్యాచులు)
రోహిత్ శర్మ- 7046 (272)
శిఖర్ ధవన్- 6769 (222)
డేవిడ్ వార్నర్- 6565 (184)
సురేశ్ రైనా- 5528 (205)
> మరి ఈ సీజన్లో విరాట్ కోహ్లీ 9వేల మార్కును అందుకుంటారా? కామెంట్ చేయండి.


