News August 21, 2025
ఏది ఏమైనా టిడ్కో ఇళ్లు కట్టిస్తాం: నారాయణ

AP: లబ్ధిదారులకు ఎట్టి పరిస్థితుల్లో టిడ్కో ఇళ్లు అందజేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. ‘గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల గందరగోళం అయ్యింది. పెండింగ్ బిల్స్ రూ.3,664 కోట్లు, కాంట్రిబ్యూషన్ రిటర్న్కి రూ.370కోట్లు, ఇళ్లు కట్టడానికి రూ.2,100 కోట్లు కావాలి. 83,072 ఇళ్లు రెడీగా ఉన్నాయి. సంక్రాంతికి మరో లక్ష ఇళ్లు, మిగిలినవి వచ్చే మార్చి చివరి నాటికి పూర్తి చేయాలని CM ఆదేశించారు’ అని తెలిపారు.
Similar News
News August 21, 2025
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు ఇవాళ కాస్త పెరిగాయి. HYD బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.600 పెరిగి రూ.1,00,750కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.500 ఎగబాకి రూ.92,300 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1,000 పెరిగి రూ.1,26,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News August 21, 2025
నేపాల్ వాదనను ఖండించిన భారత్

భారత సరిహద్దులో ఉన్న లింపియాధుర, లిపులేఖ్, కాలాపాణిలు తమ ప్రాంతాలేనన్న నేపాల్ వాదనను భారత్ ఖండించింది. ‘లిపులేఖ్ ద్వారా IND-CHINA మధ్య 1953లోనే వాణిజ్యం మొదలైంది. తర్వాత కొన్ని కారణాలతో నిలిచిపోయింది. ఇప్పుడు దాన్ని మళ్లీ ప్రారంభించాలని ఇరుదేశాలూ నిర్ణయించాయి. దీనిపై నేపాల్ అభ్యంతరం చెప్పడం సరికాదు’ అని పేర్కొంది. కాగా IND-CHI వివాదాలు పక్కనబెట్టి వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకుంటున్నాయి.
News August 21, 2025
రూ.85 వేల జీతంలో 750 బ్యాంక్ ఉద్యోగాలు

పంజాబ్&సింధ్ బ్యాంక్ 750 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీలో 80, తెలంగాణలో 50 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చదివి వయసు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయసు సడలింపు ఉంటుంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు ఉంటుంది. సెప్టెంబర్ 4లోగా <