News August 21, 2025

అనకాపల్లిలో అవగాహన సదస్సులు నిర్వహించాలి: కలెక్టర్

image

కౌమార దశలో వివాహాలు జరగకుండా అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు. బుధవారం అనకాపల్లి కలెక్టరేట్లో జిల్లాస్థాయి బాలల సంక్షేమ, రక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా, మండల, గ్రామస్థాయిలో సంక్షేమ రక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. బాల్యవివాహాలు, బాలలపై లైంగిక వేధింపులు, బాలల అక్రమ రవాణా జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. బాలలతో భిక్షాటన చేయించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Similar News

News March 13, 2026

మార్చి15న విశాఖకు మాజీ ఉపరాష్ట్రపతి

image

భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు మార్చి 15న విశాఖ రానున్నారు.15న రాత్రి విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుని కిర్లంపూడి లేఅవుట్‌‌లోని తన నివాసంలో బస చేస్తారు. మార్చి 17న సాయంత్రం 6 గంటలకు కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించే ఉగాది పురస్కార కార్యక్రమంలో పాల్గొంటారు. 19న ఉదయం విశాఖ నుంచి బయలుదేరి విజయవాడ వెళ్తారు.

News March 13, 2026

కావలి: రైలులో నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

రైలులో నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందాడు. తలమంచి- అల్లూరు రోడ్డు రైల్వే స్టేషన్ మధ్య గుర్తుతెలియని సుమారు 27ఏళ్ల వ్యక్తి బెంగళూరు- గువాహటి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు జారిపడి మరణించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు నలుపు రంగు టీ షర్ట్, లైట్ బ్లూ కలర్ జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నట్లు చెప్పారు. వివరాలు తెలిస్తే కావలి రైల్వే పోలీసులకు తెలపాలని కోరారు.

News March 13, 2026

ఏలూరు: కలెక్టరేట్‌లో మొల్లమాంబ జయంతి

image

ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జేసీ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కవయిత్రి మొల్ల మాంబ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నేటి యువత విద్యార్థిని విద్యార్థులు స్ఫూర్తి పొందాలని సూచించారు. రామాయణాన్ని సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా తక్కువ వ్యవధిలో రచించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.