News August 21, 2025
నూజివీడు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం

నూజివీడులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో ఖాళీగా ఉన్న ట్రేడ్లలో అడ్మిషన్లకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రజిత బుధవారం తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 21 నుంచి 26 సాయంత్రం 5 గంటల్లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు కళాశాలలో సంప్రదించాలని పేర్కొన్నారు.
Similar News
News August 21, 2025
విజయనగరంలో పేకాట రాయుళ్లు అరెస్ట్: సీఐ

విజయనగరం శుద్ధ వీధిలోని ఓ ఇంటిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు టూ టౌన్ సీఐ టి.శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఎస్.బంగారునాయుడు ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడి చేశామన్నారు. రూ.48,810 నగదు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని ఏడుగురిపై కేసు నమోదు చేశామన్నారు. కాగా వీరిలో పలువురు వైసీపీ నేతలు ఉన్నట్లు సమాచారం.
News August 21, 2025
స్టీల్ ప్లాంట్లో ప్రైవేట్ క్యాంటీన్లు మూసివేత

స్టీల్ ప్లాంట్లో 78 ప్రైవేట్ క్యాంటీన్లు మూసివేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఒక్కసారిగా యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో దాదాపు 510 మంది ఉపాధి కోల్పోగా లక్షల రూపాయలు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. క్యాంటీన్లో పనిచేసిన కార్మికులకు సైతం పాసులు రద్దు చేయడంతో లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. సామాన్లు తెచ్చుకోలేదని లోపలికి అనుమతించాలని క్యాంటీన్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News August 21, 2025
ఒకే కుటుంబంలో ఐదుగురు అనుమానాస్పద మృతి!

TG: హైదరాబాద్లో తీవ్ర విషాదం నెలకొంది. మియాపూర్లోని ఓ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఐదు మృతదేహాలను గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా స్థానికులు వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల్లో అత్త, మామ, భార్య, భర్త, రెండేళ్ల చిన్నారి ఉన్నారని ప్రాథమికంగా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.