News August 21, 2025
జూబ్లీహిల్స్లో BRS జెండా ఎగరాలి: KTR

రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గులాబీ జెండాను రెపరెపలాడించాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత బుధవారం ఆయన్ను కార్యకర్తలతో వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. సెగ్మెంట్లో ప్రస్తుత పరిస్థితులపై ఇరువురు చర్చించారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పని చేయాలని, గత BRS హయాంలో సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని సునీతకు KTR దిశానిర్దేశం చేశారు.
Similar News
News August 21, 2025
హజ్ యాత్రకు HYD నుంచి 2,210 మంది ఎంపిక

హజ్ యాత్రకు నగరం నుంచి 2,210 మంది ఎంపికయ్యారని రాష్ట్ర హజ్ కమిటీ ఛైర్మన్ సయ్యద్ ఆఫ్జల్ బియబానీ ఖుస్రో పాషా తెలిపారు. తెలంగాణ నుంచి మొత్తం 4,292 మందిని డ్రా పద్ధతిలో ఎంపిక చేశామన్నారు. 11,757 మంది అప్లై చేసుకోగా వీరిని డ్రా పద్ధతిలో ఎంపిక చేశామన్నారు. మరింత సమాచారం కోసం హజ్ కమిటీ కార్యాలయంలో సంప్రదించాలని ఈ సందర్భంగా సూచించారు.
News August 21, 2025
పంజాగుట్ట నిమ్స్లో ప్రపంచ సుందరి

ప్రతష్ఠాత్మక నిమ్స్లో చికిత్స పొందుతున్న క్యాన్సర్ రోగులను ప్రపంచ సుందరి ఓపల్ సుచాత పరామర్శించారు. ఇందులో అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. సదుపాయాలను డైరెక్టర్ డా.బీరప్ప వివరించారు. అనంతరం ఆమె ఆంకాలజీ బ్లాక్లో రోగులకు పండ్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో మెడికల్ ఆంకాలజీ వైద్యుడు డా.సదాశివుడు, మీడియా ఇన్ఛార్జి సత్యాగౌడ్ తదితరులు ఉన్నారు.
News August 21, 2025
HYDలో సక్సెస్.. ఇక రాష్ట్రమంతటా!

మంత్రి సీతక్క బుధవారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీలో చిన్నారులకు త్వరలో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ప్రారంభిస్తామని స్పష్టంచేశారు. ఇప్పటికే HYDలో 139 అంగన్వాడీ కేంద్రాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేయగా హాజరు 30% పెరిగిందని వెల్లడించారు. అంగన్వాడీ నూతన భవనాలకు ఇసుక ఉచితంగా సరఫరా చేయాలని ఆదేశించారు. టిఫిన్తో పాటు 100ML పాలు, వారంలో ఓ రోజు ఎగ్ బిర్యానీ, మరో రోజు వెజిటబుల్ కిచిడీ అందిస్తారు.