News August 21, 2025

WGL: ఉపాధ్యాయుల పదోన్నతులకు లైన్ క్లియర్

image

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల పదోన్నతులపై ఉన్న స్టేను హైకోర్టు ఎత్తివేయడంతో పదోన్నతులకు మార్గం సుగమమైంది. తీర్పు కాపీ రాగానే పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమవుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ మొదలైతే రెండు, మూడు రోజుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సుమారు 100 మందికి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు లభించనున్నాయి.

Similar News

News March 13, 2026

ఫ్లాష్ ఫ్లడ్స్‌ను 24hrs ముందే అంచనా వేయొచ్చు: పిచాయ్

image

పట్టణాల్లో ఆకస్మిక వరదలను 24hrs ముందే అంచనా వేసే ‘గ్రౌండ్ సోర్స్’ అనే కొత్త AI మోడల్‌ను రూపొందించినట్లు గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రకటించారు. ‘జెమినీ’ సాయంతో ఇది 150+ దేశాల్లో 26లక్షల వరద సంఘటనలను విశ్లేషించిందని తెలిపారు. శాస్త్రవేత్తల పరిశోధనలు, ప్రజల సేఫ్టీ కోసం ఈ డేటాను గూగుల్ <>’ఫ్లడ్ హబ్<<>>’లో అందుబాటులో ఉంచారు. ఇందులో ఏరియా పేరు సెర్చ్ చేయాలి. ముప్పు ఉంటే రెడ్ మార్క్ చూపిస్తుంది.

News March 13, 2026

మధిర: హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

image

మధిర రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో ఒడిశా రాష్ట్రానికి చెందిన శిభా భిషోయ్‌(29)కు జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ సత్తుపల్లి 6వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం.శ్రీనివాస్ గురువారం తీర్పు వెల్లడించారు. 2025 జూన్ 8న కొదుమూరు రోడ్ నిర్మాణ పనుల వద్ద సుమంత్ కుమార్ పండేను ఇనుపరాడుతో దాడి చేసి హత్య చేసినట్లు నిరూపితమైంది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులను సీపీ అభినందించారు.

News March 13, 2026

భద్రాద్రి: లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డు

image

భద్రాద్రి జిల్లా పోలీసుల ఎదుట ఇటీవల 27 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వివిధ క్యాడర్లో పనిచేస్తూ లొంగిపోయిన మావోయిస్టు సభ్యులకు గురువారం రూ.62,50,0000 విలువ గల చెక్కులను ఎస్పీ రోహిత్ రాజు, అడిషనల్ ఎస్పీ నరేందర్ అందజేశారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో స్వార్థ ప్రయోజనాలతో మావోయిస్టు నాయకులు అమాయక ఆదివాసీలను బలవంతంగా పార్టీలో చేర్చుకుని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా చేస్తున్నారని చెప్పారు.