News August 21, 2025

ALLERT: రెండో హెచ్చరిక జారీ.. భద్రాద్రి కలెక్టర్ ఆదేశాలు

image

భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరగడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయిన నేపథ్యంలో ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. అధికారులు ఇప్పటికే పునరావాస చర్యలు చేపట్టారని, అవసరమైతే మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజలకు తాగునీరు, ఆహారం, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా వంటి అన్ని కల్పించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News March 13, 2026

ఖమేనీ భార్య బతికే ఉన్నారు: ఇరాన్ మీడియా

image

US, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ <<19282331>>ఖమేనీ భార్య<<>> మన్సౌరే ఖోజాస్తే బగెర్జాదేహ్ చనిపోయినట్లు వచ్చిన వార్తలను ఇరానియన్ మీడియా ఖండించింది. ఆమె బతికే ఉన్నారని IRGC అనుబంధ మీడియా సంస్థ ‘ఫార్స్’ న్యూస్ వెల్లడించింది. కొత్త సుప్రీం లీడర్‌ ముజ్తబా ఖమేనీ కూడా తన తొలి అధికారిక ప్రసంగంలో తల్లి మరణించారని ఎక్కడా ప్రస్తావించలేదు.

News March 13, 2026

WGL: వెంట్రుకల చోరీ కేసులో నలుగురి అరెస్టు

image

బట్టల బజార్‌లోని శ్యామల ఎంటర్‌ప్రైజెస్‌లో రూ.10 లక్షల విలువైన వెంట్రుకలను దోచుకెళ్లిన కేసులో నలుగురు నిందితులను మట్వాడ పోలీసులు అరెస్టు చేశారు. ఫిబ్రవరి 9న షేక్ బషీరా, షేక్ సలీమా, షేక్ నయీమ్,నాగన్న అనే వ్యక్తులు యజమాని కుమారస్వామిపై దాడి చేసి వెంట్రుకల బస్తాలను ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు చెప్పారు.

News March 13, 2026

ఆర్మూర్: టెన్త్ పరీక్షలు.. 5 నిమిషాల వెసులుబాటు

image

ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:35 గంటల వరకు (5 నిమిషాల ఆలస్యం) వచ్చే విద్యార్థులను మాత్రమే అనుమతిస్తామని అధికారులు తెలిపారు. ఆ తర్వాత వస్తే అనుమతి ఉండదని చెప్పారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రానికి వచ్చేందుకు ముందుగానే ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.