News April 1, 2024

ఏలూరు: కళ్ల ముందే భర్త మరణం..

image

ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కండ్రికగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాలు.. బైక్‌పై వెళ్తున్న దంపతులు వేణి, పవన్ ప్రమాదవశాత్తు కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో పవన్ అక్కడికక్కడే చనిపోగా వేణికి గాయాలయ్యాయి. భర్త కళ్లముందే చనిపోవడంతో ఆమె రోదనలు మిన్నంటాయి. వెంటనే ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.   

Similar News

News October 1, 2025

అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి: మంత్రి వర్మ

image

కేంద్ర ప్రభుత్వం పథకాల అమలు జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి ముద్ర యోజన కింద బ్యాంకులు లబ్ధిదారులకు విరివిగా రుణాలు మంజూరు చేసి పేద వర్గాలకు ఆర్థికంగా చేయూత నివ్వాలన్నారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్ పాల్గొన్నారు.

News September 30, 2025

నరసాపురం తీరంలో విషపుటీగల గూడులు

image

నరసాపురం తీర ప్రాంతంలో విషపుటీగల గూడులు దర్శనమిస్తున్నాయి. ఇటీవల నరసాపురం మండలం వేములదీవి వెస్ట్ కాపులకొడప గ్రామంలో భార్యభర్తలపై ఇవి దాడి చేశాయి. 2004 సునామీ తరువాత సముద్రం మీదగా నరసాపురం తీర ప్రాంతానికి వచ్చిన ఈ విషపు ఈగలు పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంతంలో తిష్ట వేశాయి. గతంలో పేరుపాలెం, పెదమైనవానిలంక గ్రామంలో వీటి దాడిలో పలువురు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు ఉన్నాయి.

News September 30, 2025

తణుకు: పోలీసులకు సవాలుగా మారిన దొంగతనం కేసు

image

తణుకు వారణాసివారి వీధిలో ఇటీవల సంచలనం రేకెత్తించిన చోరీ వ్యవహారం పోలీసులకు సవాలుగా మారింది. ఒంటరిగా జీవిస్తున్న వృద్ధురాలు వాకలపూడి కనకదుర్గను బెదిరించి 70 కాసులు బంగారు ఆభరణాలు దుండగులు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే పొరుగు రాష్ట్రాలకు చెందిన నిందితులు దోపిడీ అనంతరం మహారాష్ట్ర పారిపోయినట్లు సమాచారం. దీంతో బృందాలుగా విడిపోయిన పోలీసు సిబ్బంది వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.