News August 21, 2025
జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు: కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు. బుధవారం ఆమె సిర్గాపూర్లో ఫర్టిలైజర్ దుకాణంలో ఎరువుల విక్రయాలను పరిశీలించారు. జిల్లాలో వ్యవసాయ సాగుకు అవసరమైన యూరియా సమృద్ధిగా ఉందని తెలిపారు. యూరియాను పంట సాగుకు మాత్రమే వినియోగించాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖల సమన్వయంతో టాస్క్ ఫోర్స్ టీం అక్రమ రవాణా జరగకుండా చూస్తుందన్నారు.
Similar News
News March 24, 2026
ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పందించండి: ఎస్పీ

ప్రజల నుంచి అందిన ఫిర్యాదులపై పోలీసులు త్వరితగతిన స్పందించి, పారదర్శకమైన పరిష్కారం చూపాలని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. PGRS ద్వారా వచ్చే ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో విచారించాలన్నారు. విజిబుల్ పోలీసింగ్ను పెంచాలని, ‘నారీ శక్తి’ కార్యక్రమం ద్వారా మహిళా భద్రతపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు.
News March 24, 2026
ఎన్నికల వేళ కమల్ హాసన్ సంచలన ప్రకటన

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్ సంచలన ప్రకటన చేశారు. ఇది త్యాగం కాదని, తన డ్యూటీ అని ట్వీట్ చేశారు. అయితే డీఎంకే కూటమికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. కాగా ఎన్నికల్లో కమల్ పార్టీకి డీఎంకే రెండు స్థానాలు కేటాయిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలోనే కమల్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
News March 24, 2026
ఇంధన ఎమర్జెన్సీ.. ఫిలిప్పీన్స్ ఏం చేస్తోందంటే?

ఇంధన వనరుల(పెట్రోల్, గ్యాస్, విద్యుత్) కొరత ఏర్పడి ప్రజా సంక్షేమానికి ముప్పు కలిగే పరిస్థితే ఇంధన ఎమర్జెన్సీ. దీన్ని నివారించేందుకు ఫిలిప్పీన్స్ <<19467390>>ఎమర్జెన్సీ<<>> ప్రకటించింది. రవాణా, వ్యవసాయం, పరిశ్రమలకు UPLIFT పథకంతో సాయం చేయనుంది. ఇంధన ఆదాకు చర్యలు తీసుకోవడంతోపాటు అక్రమ నిల్వలపై ఉక్కుపాదం మోపనుంది. 10 లక్షల బ్యారెళ్ల చమురును బఫర్ స్టాక్గా పెట్టనుంది. ఇంధన సరఫరాదారులకు ముందస్తు చెల్లింపులు చేయనుంది.


