News August 21, 2025
సంగారెడ్డి: ఎంపికైతే నెలకు రూ.6వేలు

2035-26 సంవత్సరానికి దీన్ దయల్ స్పర్శ యోజన ఉపకార వేతనాల కోసం సెప్టెంబర్ 13 వరకు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పోస్టల్ డివిజన్ శ్రీహరి బుధవారం తెలిపారు. 6 నుంచి 11వ తరగతి వరకు చదివే విద్యార్థులు అర్హులని చెప్పారు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.6 వేల ఉపకార వేతనం అందుతుందని పేర్కొన్నారు.
Similar News
News August 21, 2025
ప్రకాశానికి మంత్రుల రాక

జిల్లాల పునర్విభజన మార్పులపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం ఈ నెల 30వ తేదీన ప్రకాశం జిల్లాకు రానున్నట్లు సమాచారం. ప్రకాశం జిల్లాలోని మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించడం, కందుకూరును జిల్లాలో కలపడం, ఇతర అంశాలపై మంత్రుల బృందం ప్రజాభిప్రాయ సేకరణ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. మంత్రులు నిమ్మల రామానాయుడు, సత్య కుమార్ యాదవ్ జిల్లాకు రానున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే అధికారులు ధృవీకరించాల్సి ఉంది.
News August 21, 2025
కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు మొదలు: జగదీశ్ రెడ్డి

TG: కాంగ్రెస్ పాలనలో రైతులకు <<17461451>>కష్టాలు<<>> మొదలయ్యాయని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. యూరియా కోసం రోడ్లెక్కి, అధికారుల కాళ్లు మొక్కే పరిస్థితి వచ్చిందన్నారు. ఢిల్లీ కాళ్లు మొక్కి టికెట్లు తెచ్చుకునే నేతలు, ప్రజలకు అదే అలవాటు చేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. కొందరు మంత్రులు, దళారులు కుమ్మక్కై రైతులకు ఈ దుస్థితి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
News August 21, 2025
KNR: వృద్ధులపై కఠినంగా బిడ్డలు

పింఛన్, ఆస్తి.. కారణమేదైనా మలిదశలో తల్లిదండ్రులను కాదనే ప్రభుద్ధులెందరో ఉమ్మడి KNRలో ఇప్పటికీ ఉన్నారు. కొన్నినెలల క్రితం JGTL(D)వెల్గటూర్, రాయికల్, కోరుట్లల్లో వివిధకారణాలతో బిడ్డల నుంచి భరోసా కరవై వృద్ధులు రోడ్డెక్కారు. తాజాగా KNR(D)శంకరపట్నం మొలంగూర్లో ఓ కొడుకు<<17470521>> తల్లిని బయటకు గెంటేసి<<>> ఇంటికి తాళమేసుకున్నాడు. ఇలాంటి బాధితులు RDOలు, పోలీసులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ అధికారులను కలిసి న్యాయం పొందొచ్చు.