News August 21, 2025
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

TG: సీఎం రేవంత్ ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ఆయన ఢిల్లీకి పయనమవుతారు. ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత పలువురు కీలక నేతలతో రేవంత్ భేటీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Similar News
News August 21, 2025
రూ.400 కోట్ల ఆస్తిని కాపాడిన హైడ్రా!

TG: ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. HYD మాదాపూర్ జూబ్లీ ఎన్క్లేవ్లో పార్కులతో పాటు రహదారుల ఆక్రమణలను తొలగించింది. GHMCకి గిఫ్ట్ డీడ్ చేసిన పార్కులను జైహింద్ రెడ్డి అనే వ్యక్తి కబ్జా చేశారన్న ఎన్క్లేవ్ ప్రతినిధుల ఫిర్యాదుతో క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేపట్టింది. కబ్జాకు గురైన 16వేల గజాల స్థలాన్ని పరిరక్షించింది. వీటి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. వీటి విలువ రూ.400 కోట్లని సమాచారం.
News August 21, 2025
రూ.కోటి ప్రశ్నకు సమాధానం చెప్పగలరా?

‘కౌన్ బనేగా కరోడ్పతి- 17’లో ఉత్తరాఖండ్కు చెందిన IPS ఆదిత్య కుమార్ రూ.కోటి గెలుచుకుని సత్తాచాటారు. ఈ సీజన్లో ఈయనే తొలి కరోడ్పతి కావడం విశేషం. ఈ సందర్భంగా నెట్టింట ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి. రూ.కోటి ప్రశ్న ఇదే.. ‘మొదటి అణు బాంబు తయారీకి ఉపయోగించిన ప్లూటోనియం అనే మూలకాన్ని వేరుచేసిన శాస్త్రవేత్త పేరు మీద ఉన్న మూలకం ఏది? A. సీబోర్జియం, B. ఐన్స్టీనియం, C. మైట్నేరియం, D. బోహ్రియం. ANS ఏంటి?
News August 21, 2025
లోక్సభ నిరవధిక వాయిదా

లోక్సభ నిరవధిక వాయిదా పడింది. 21 రోజుల పాటు సభ జరిగింది. సమావేశాల సందర్భంగా నిన్న ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు ఆమోదం లభించింది.