News August 21, 2025
అనకాపల్లి: వరి పొలాల్లో నీరు చేరిందా?

అనకాపల్లి జిల్లాలో 3రోజులు పాటు కురిసిన వర్షాలకు వరి పొలాల్లో చేరిన నీటిని వెంటనే తొలగించాలని జిల్లా వ్యవసాయాధికారి మోహన్రావు రైతులకు సూచించారు. నీటిని తొలగించిన తర్వాత ఎకరానికి 40 కిలోల గ్రోమోర్ ఎరువు 28:28:0ను వేయాలన్నారు. నాట్లుకు ముందు దమ్ము పట్టిన రైతులు ఎకరానికి 50 కిలోల డీఏపీ వేసుకోవాలన్నారు. అర్హులైన రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అందకపోతే తక్షణం రైతు సహాయ కేంద్రంలో సంప్రదించాలని సూచించారు.
Similar News
News August 21, 2025
JANలో ‘దేవర-2’ షూట్.. ఆ తర్వాతే వేరే మూవీ!

‘దేవర-2’ సినిమా అటకెక్కిందని వస్తోన్న ప్రచారం ఫేక్ అని సినీవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమా స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు వెల్లడించాయి. అన్నీ కుదిరితే జనవరి నుంచి షూట్ మొదలు పెట్టేలా ప్లాన్ చేస్తున్నారని, ఇది పూర్తయ్యాకే మిగతా సినిమాలపై దృష్టి పెడతారని చెప్పాయి. కాగా ‘దేవర-2’ 2027 సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News August 21, 2025
కడప జిల్లాలో 81 మంది MPEOలు బదిలీ

కడప జిల్లా వ్యవసాయ శాఖలో పనిచేసే 81 మంది మల్టీ పర్పస్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ (MPEO)లను బదిలీ చేశారు. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చంద్రనాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని పని సర్దుబాటు కోసం బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరిలో కొందరిని ఒక మండలం నుంచి మరొక మండలానికి, మరి కొందరిని ఒక డివిజన్ నుంచి వేరే డివిజన్ కు బదిలీ చేశారు. వీరు గ్రామాల్లో రైతులకు సహాయంగా RSKల్లో ఉంటారు.
News August 21, 2025
సిరిసిల్ల: ’నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి’

గణేష్ మండపాల నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బీ గీతే అన్నారు. సిరిసిల్లలోని SP కార్యాలయంలో గురువారం ప్రకటన విడుదల చేశారు. మండపాలు ప్రజా రవాణా, ఎమర్జెన్సీ వాహనాలకు ఇబ్బందులేకుండా ఏర్పాటు చేసుకోవాలన్నారు. విద్యుత్ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. మండపాల నిర్వాహకుల బాధ్యత వహించే వారి ఫోన్ నెంబర్లు మండపాలలో ఏర్పాటు చేయాలన్నారు. CC కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.