News August 21, 2025

HYD: 101 మందికి సీవీ ఆనంద్ స్పెషల్ కౌన్సెలింగ్

image

నగరంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని HYD సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. బుధవారం బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో ఎగ్జిక్యూటివ్ కోర్టు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ల నుంచి వచ్చిన నివేదికలను పరిశీలించిన సీపీ ఆయా గ్యాంగ్‌లు పరస్పరం దాడులు, హత్యలు, హత్యాయత్నాలు వంటి నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. మొత్తం 101 మందిని విడిగా విచారించారు.

Similar News

News March 27, 2026

HYD: ​పెట్రోల్ ఫుల్.. ఇక నో టెన్షన్!

image

రాష్ట్రంలో ఇంధన సరఫరా జోరందుకుంది. సాధారణంగా రోజూ వచ్చే 13,231 కిలో లీటర్ల కంటే రెట్టింపు స్థాయిలో మార్చి 26న ఏకంగా 36,189 కిలో లీటర్ల పెట్రోల్, డీజిల్‌ను సర్కార్ పంపిణీ చేసింది. ఇందులో 16,609 KL పెట్రోల్, 19,580 KL డీజిల్ ఉన్నాయి. సగటు అవసరాల కంటే భారీగా స్టాక్ అందుబాటులోకి రావడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. రద్దీ తగ్గించుకొని, ధైర్యంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

News March 27, 2026

‘వేదమందిర్’కు జ్యోతిష్కులు కావలెను!

image

ప్రముఖ ఆధ్యాత్మిక వేదిక ‘వేదమందిర్’ సేవలు మరింత విస్తరించేందుకు జ్యోతిష్కులను నియమించుకుంటోంది. మా లక్షలాది తెలుగు భక్తులకు సరైన మార్గదర్శనం చేసేందుకు నిపుణులైన జ్యోతిష్కులు (Astrologers) కావలెను.
– జ్యోతిషశాస్త్రంలో మంచి పట్టు
– విషయంపై స్పష్టమైన వివరణ ఇచ్చే నైపుణ్యం
మీరు జ్యోతిష్యంలో ప్రావీణ్యం ఉన్నవారైతే వెంటనే సంప్రదించండి!
<<7337592828>>Click on Whatsapp<<>>

News March 27, 2026

హైదరాబాద్‌: రూ. 217 కోట్ల భారీ జీఎస్‌టీ స్కామ్

image

తెలుగు రాష్ట్రాల్లో రూ. 217 కోట్ల జీఎస్‌టీ కుంభకోణాన్ని డీజీజీఐ (DGGI) అధికారులు ఛేదించారు. 72 షెల్ కంపెనీల ద్వారా ఎలాంటి వస్తు సరఫరా లేకుండానే రూ. 1,472 కోట్ల నకిలీ లావాదేవీలు సృష్టించినట్లు గుర్తించారు. తప్పుడు పత్రాలతో ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టి, అక్రమంగా ఐటీసీ (ITC) క్లెయిమ్ చేశారు. హైదరాబాద్, ఏపీల్లో జరిపిన దాడుల్లో కీలక సాక్ష్యాధారాలు, డిజిటల్ డేటాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.