News August 21, 2025

HYD: 101 మందికి సీవీ ఆనంద్ స్పెషల్ కౌన్సెలింగ్

image

నగరంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని HYD సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. బుధవారం బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో ఎగ్జిక్యూటివ్ కోర్టు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ల నుంచి వచ్చిన నివేదికలను పరిశీలించిన సీపీ ఆయా గ్యాంగ్‌లు పరస్పరం దాడులు, హత్యలు, హత్యాయత్నాలు వంటి నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. మొత్తం 101 మందిని విడిగా విచారించారు.

Similar News

News September 13, 2025

HYD: స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు

image

మాసబ్‌ట్యాంక్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డీ-ఫార్మసీ కోర్సులో స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తెలిపారు. దోస్త్ ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈ నెల 16న ఉదయం 10 గంటలకు జరిగే అడ్మిషన్ ప్రక్రియకు హాజరుకావాలని పేర్కొన్నారు.

News September 13, 2025

గాంధీలో ఉత్తమ సేవలకు సహకారం: జూడాలు

image

గాంధీ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్‌ డాక్టర్ ఎన్.వాణిని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్(జూడా) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఆసుపత్రి సేవల మెరుగుదలకు తమ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే జూనియర్ వైద్యుల సంక్షేమానికి తోడ్పాటు అందించాలని కోరారు. కార్యక్రమంలో జూడా అధ్యక్షుడు డా.అజయ్‌కుమార్ గౌడ్ సహా పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.

News September 13, 2025

HYD: మెట్రో నిర్వహణలో అసలేంటి L&Tకి సమస్య

image

L&T ఆధ్వర్యంలో సిటీలో 2017లో మెట్రో ప్రారంభమైంది. ఆ రోజుకు కంపెనీకి ప్రభుత్వం ఇవ్వాల్సిన మొత్తం రూ.3,756 కోట్లు. అయితే ఇంతవరకు ఆ మొత్తం సర్కారు చెల్లించలేదు. దీంతో ఆ మొత్తం వడ్డీతో కలిపి 2020 నాటికి రూ.5 వేల కోట్లకు పెరిగింది. ఈ మొత్తంతోపాటు ప్రభుత్వం ఇవ్వాల్సిన వయబిలిటీ ఫండ్ రూ.254 కోట్లూ ఇవ్వలేదు. దీంతోతాము ఇక నడపలేమని L&T చెబుతోంది.