News August 21, 2025

తిరుమలకు ఫ్రీ బస్.. కానీ!

image

తిరుమలకు వెళ్లే బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొండపైకి రోజూ 362 బస్సులు నడుస్తున్నాయి. ఇందులో 64 ఎలక్ట్రికల్ ఏసీ బస్సులు కావడంతో వాటిలో ఫ్రీ టికెట్ ఇవ్వరు. రోజూ కొండపైకి బస్సుల్లో 45వేల మంది ప్రయాణిస్తుంటారు. ఇందులో పురుష భక్తులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిని తీసేస్తే సరాసరి 7వేల మంది ఏపీ మహిళలకు లబ్ధి చేకూరనుంది.

Similar News

News March 13, 2026

విషాదం.. సాఫ్ట్‌వేర్ దంపతుల దుర్మరణం

image

ఆదోని నుంచి బెంగళూరుకు కారులో వెళ్తున్న దంపతులను మృత్యువు వెంటాడింది. కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అనురాగ్, ఐశ్వర్య దుర్మరణం చెందారు. కర్ణాటక సరిహద్దులో జరిగిన ఈ ఘటనలో ఐశ్వర్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, అనురాగ్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. బెంగళూరులో సొంతిల్లు కట్టుకుని ఆనందంగా జీవిస్తున్న దంపతుల మృతితో ఆదోని తిరుమలనగర్‌లో విషాదం అలుముకుంది.

News March 13, 2026

హోటళ్లకు గ్యాస్ కష్టాలు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో వాణిజ్య గ్యాస్ కొరత కష్టాలు మొదలయ్యాయి. బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్ ధర భారీగా పెరగడంతో పలుచోట్ల చిన్న హోటళ్లు మూతపడుతున్నాయి. మరోవైపు డొమెస్టిక్ గ్యాస్ ఆన్‌లైన్ బుకింగ్‌లు కావడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్ చేస్తే కట్ అవుతోందని, సాంకేతిక ఇబ్బందులతో కష్టాలు పడుతున్నామని ప్రజలు పేర్కొంటున్నారు. మరి మీకూ ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయా? కామెంట్ చేయండి..

News March 13, 2026

పాక్ ప్లేయర్ కొనుగోలుపై వివాదం.. సన్‌రైజర్స్‌కు షాక్!

image

‘The Hundred’ టోర్నీకి <<19366541>>పాక్<<>> ఆటగాడు అబ్రార్‌ను కొని విమర్శలు ఎదుర్కొంటున్న సన్‌రైజర్స్ ఫ్రాంచైజీకి మరో షాక్ తగిలింది. సన్‌రైజర్స్ లీడ్స్ X అకౌంట్ సస్పెండ్ అయింది. రూల్స్ ఉల్లంఘించిన అకౌంట్లను X సస్పెండ్ చేస్తుందని ఆ పేజ్‌లో ఉంది. యూజర్లు రిపోర్ట్ చేయడం ఓ కారణంగా తెలుస్తోంది. ఫ్రాంచైజ్ ఓనర్ కావ్యా మారన్‌పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్ ఐపీఎల్‌లో SRH మ్యాచ్‌లు బాయ్‌కాట్ చేయాలని SMలో ట్రెండ్ చేస్తున్నారు.