News August 21, 2025
కొయ్యూరు: మూడు నెలల వ్యవధిలో తల్లీబిడ్డ మృతి

కొయ్యూరు(M) మూలపేట పంచాయతీ జాజులబంధలో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతూ మర్రి వైకుమార్ (తండ్రి కామేశ్వరరావు) అనే బాలుడు బుధవారం మృతి చెందాడు. మూడు నెలల క్రితం కామేశ్వరరావు భార్య కుమారి కూడా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. వరుసగా తల్లీబిడ్డ మృతి చెందడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. గ్రామానికి రహదారి సౌకర్యం లేక, సకాలంలో వైద్యం అందడం లేదని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.
Similar News
News March 5, 2026
సౌతాఫ్రికాకు హార్ట్ బ్రేక్!

ప్రపంచకప్ గెలవాలనుకున్న సౌతాఫ్రికాకు మరోసారి నిరాశే మిగిలింది. T20 WC-2026లో సెమీస్లో బోల్తా పడింది. ఈ ఎడిషన్లో ఓటమి అనేదే లేకుండా దూసుకొచ్చిన SA ఆశలపై న్యూజిలాండ్ <<19299856>>నీళ్లు చల్లింది<<>>. 2024 ఫైనల్లోనూ చివరి దాకా పోరాడి ఇండియా చేతిలో SA ఓడిపోయింది. గతేడాది మహిళల జట్టు ODI WC ఫైనల్లో భారత్ చేతిలోనే పరాజయం పాలైంది. తాజా ఓటమితో సౌతాఫ్రికాకు హార్ట్ బ్రేక్ తప్పలేదు. better luck next time.
News March 4, 2026
యూరియా ఉత్పత్తి తగ్గుదల.. పెరగనున్న రేట్లు?

మిడిల్ ఈస్ట్లో యుద్ధం కారణంగా ఖతర్లో LNG <<19281702>>ఉత్పత్తి<<>> నిలిచిపోవడంతో ఇండియాలో యూరియా ప్రొడక్షన్ను కంపెనీలు తగ్గిస్తున్నాయి. యూరియా ఉత్పత్తికి LNG ప్రైమరీ ఫీడ్స్టాక్. ఇది ఎనర్జీ సోర్స్గానే కాకుండా ఎరువుల తయారీ ప్రక్రియలోనూ కీలకమైన ఇన్పుట్. యూరియా కొరత ఏర్పడితే రేట్లు ఆకాశాన్నంటే అవకాశం ఉంది. అయితే పరిస్థితి అదుపులోనే ఉందని ఎరువుల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు.
News March 4, 2026
BNGR: హాస్టళ్లలో ఇక ‘ఫేషియల్’ హాజరు..! .

జిల్లాలోని 85 సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఇకపై Facial Recognition (FRS) ద్వారా హాజరు నమోదు చేయనున్నారు. SC, ST, BC, మైనార్టీ, కేజీబీవీల్లో పారదర్శకత కోసమే ఈ నిర్ణయమని కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. విద్యార్థులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ యాప్లో వివరాలు నమోదు చేసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు భాస్కర్ రావు, వెంకా రెడ్డి పాల్గొన్నారు.


