News August 21, 2025
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3,89,954 మంది ఓటర్లు

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,89,954 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పురుషులు 2,03,137, మహిళలు 1,86,793, ఇతరులు 24, మొత్తం సర్వీస్ ఓటర్లు 18, ఓవర్సీస్ ఓటర్లు 96, దివ్యాంగులు 1,854, 80 సంవత్సరాలు పైబడినవారు 6,047 ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా.. సెప్టెంబర్ 30 వరకు ఓటర్ ఫైనల్ జాబితాను అధికారులు విడుదల చేయనున్నారు.
Similar News
News March 20, 2026
GNT: పోలీస్ గ్రీవెన్స్ నిర్వహించిన ఎస్పీ

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ సిబ్బంది కోసం గ్రీవెన్స్ జరిగింది. ఎస్పీ వకుల్ జిందాల్ సమస్యలు తెలుసుకొని ఫిర్యాదులను స్వీకరించారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని, జరిగిన తప్పులు మరోసారి జరగకుండా చూసుకోవాలని, వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. శాఖపరమైన చర్యలు ఎదుర్కొంటున్న సిబ్బందిని విచారణ అనంతరం విధుల్లోకి తీసుకుంటామని అన్నారు.
News March 20, 2026
ఏప్రిల్ 1 నుంచి ఆ బ్యాంకుల ఏటీఎమ్ రూల్స్ ఛేంజ్!

ATM మనీ విత్డ్రాలపై HDFC, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కోత విధించాయి. ఇప్పటివరకు సెపరేట్గా ఉన్న UPI విత్డ్రాల్స్ను రెగ్యూలర్ కార్డ్ విత్డ్రాల్తో HDFC కలిపేయనుంది. దీంతో ఫ్రీ లిమిట్ దాటితే ట్రాన్సాక్షన్కు ₹23 చొప్పున ఛార్జ్ పడుతుంది. ఇక PNB రూపే NCMC ప్లాటినమ్ డొమెస్టిక్ సహా పలు వేరియంట్లపై డైలీ విత్డ్రాల్ లిమిట్ ₹లక్ష నుంచి ₹50వేలుకు తగ్గించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పులు అమలులోకి రానున్నాయి.
News March 20, 2026
కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లు: భట్టి

TG: రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులైన 2 లక్షల మందికి నూతనంగా పెన్షన్లు మంజూరు చేస్తామని ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ పథకం కోసం బడ్జెట్లో రూ.14,861 కోట్లు ప్రతిపాదించామని తెలిపారు. కాగా చేయూత స్కీమ్ కింద ప్రస్తుతం నెలకు రూ.2వేలు, దివ్యాంగులకు రూ.4వేల పెన్షన్ అందుతోంది.


