News August 21, 2025
దూసుకుపోతున్న KPHB ‘రియల్’ బిజినెస్

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా తగ్గుముఖం పడుతోందని వస్తున్న వార్తలను పటాపంచలు చేస్తూ KPHB కాలనీలో ఎకరం ఏకంగా రూ.70 కోట్లు పలికింది. ఐటీ కారిడార్కు పక్కనే ఉండడం, కమర్షియల్ నిర్మాణాలు శరవేగంగా పెరగుతుండటంతో ఇక్కడి రియల్ వ్యాపారం దూసుకుపోతోందని నిపుణుల అంచనా. గతంలో హౌసింగ్ బోర్డు వేలం వేసిన ప్రతి వేలంపాటలో కూడా ఎక్కడా లేని విధంగా ధర పలుకుతూ వచ్చింది. ఇప్పుడు నగరంలో KPHB హాట్ కేక్గా మారింది.
Similar News
News August 21, 2025
HYD: ఎవడ్రా నువ్ KTR: గజ్జెల కాంతం

TPCC ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం ఈరోజు గాంధీభవన్లో మాట్లాడారు. ‘దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది కాంగ్రెస్.. అంత గొప్ప పార్టీని థర్డ్ క్లాస్ పార్టీ అంటావా ఎవడ్రా నువ్ KTR.. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే నీ అయ్య KCR ఈ జన్మలో CM కాకపోతుండే, నువ్ మంత్రి కాకపోతుండే.. థర్డ్ క్లాస్ నా కొడుకులు మీరు.. నీ అయ్య చీప్ లిక్కర్ తాక్కుంటా పండి, తాగుబోతు పార్టీ పెట్టిండు.. నీ అయ్య చరిత్ర తెలుసుకో’ అని అన్నారు.
News August 21, 2025
HYD: ఇంటర్ అడ్మిషన్లకు ఆగస్టు 31 వరకు అవకాశం

2025-26 విద్యా సంవత్సరంలో ఇంకా ఇంటర్లో చేరని విద్యార్థులకు బోర్డు గుడ్ న్యూస్ ప్రకటించింది. ఈ నెల 31లోపు తమకు నచ్చిన కళాశాలల్లో అడ్మిషన్ తీసుకోవచ్చని పేర్కొంది. ఆయా కళాశాలల ప్రిన్సిపళ్లు విద్యార్థులకు సహకరించాలని కోరింది. ఇదిలా ఉండగా జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ తీసుకునే సమయంలో సంబంధిత కాలేజీకి బోర్డు గుర్తింపు ఉందో, లేదో పరిశీలించాలని తల్లిదండ్రులకు సూచించింది.
News August 21, 2025
HYDలో SMART మీటర్ వాల్వ్లు వస్తున్నాయి!

జలమండలి పరిధిలో దాదాపుగా 5,000 వరకు గృహాలకు సరఫరా చేసేందుకు మెయిన్ వాల్వ్లు ఉన్నాయి. వీటిలో మొదట 1000 వాల్వ్లను స్మార్ట్ వాల్వ్లుగా మార్చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. స్మార్ట్ ఆటోమేటిక్ వాల్వ్లతో నిర్ణీత సమయంలో నీటిని సరఫరా చేయడం, నాణ్యత గుర్తించడం, ఇతర సమస్యలకు చెక్ పెట్టొచ్చనే నేపథ్యంలో వాటిపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.