News August 21, 2025
ఒకే కుటుంబంలో ఐదుగురు అనుమానాస్పద మృతి!

TG: హైదరాబాద్లో తీవ్ర విషాదం నెలకొంది. మియాపూర్లోని ఓ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఐదు మృతదేహాలను గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా స్థానికులు వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల్లో అత్త, మామ, భార్య, భర్త, రెండేళ్ల చిన్నారి ఉన్నారని ప్రాథమికంగా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News August 21, 2025
ఆసియా కప్లో యథావిధిగా భారత్-పాక్ మ్యాచ్లు!

భారత్-పాక్ మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్లు/స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. మన క్రీడాకారులు పాక్లో గానీ, వాళ్ల ప్లేయర్లు భారత్లో గానీ ఎలాంటి ఈవెంట్స్లో పాల్గొనరని చెప్పింది. అయితే ఇంటర్నేషనల్ ఈవెంట్స్కు సంబంధించి న్యూట్రల్ వేదికల్లో ఇరు దేశాలు తలపడేందుకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఆసియా కప్ UAEలో జరగబోతోంది. అంటే ఇందులో IND-PAK మధ్య పోరు ఉంటుందని స్పష్టమవుతోంది.
News August 21, 2025
217 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం

TG: CCLAలో 217 పోస్టులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 15 కొత్త రెవెన్యూ మండలాల్లో 189 పోస్టులు, రెండు డివిజన్ల కోసం 28 పోస్టులు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. ఆదిలాబాద్, మహబూబ్నగర్, వనపర్తి, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నల్గొండ, గద్వాల జిల్లాల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు త్వరలోనే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
News August 21, 2025
KTRను సొంత చెల్లే వ్యతిరేకిస్తోంది: సీతక్క

TG: ‘థర్డ్ క్లాస్ పార్టీ’ అన్న <<17464123>>KTR<<>> కామెంట్స్పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ‘KTR ఇంట్లో పంచాయితీ తట్టుకోలేక డైవర్ట్ చేయడానికి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. సొంత చెల్లే వ్యతిరేకించడంతో మైండ్ కరాబైంది’ అని ఎద్దేవా చేశారు. ‘BRS బండారం SEP 9న బయట పడుతుంది. BJPతో దోస్తీ ఉందో లేదో తేలిపోతుంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగుబిడ్డకు మద్దతుగా నిలబడతావా, లేదా?’ అని KTRని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.