News August 21, 2025
ఒంటిమిట్టలో శ్రీవారి లడ్డూల విక్రయం

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామయ్య సన్నిధిలో తిరుమల శ్రీవారి దేవస్థానం ఆధ్వర్యంలో 200 శ్రీవారి లడ్డూలు భక్తులకు అందుబాటులో ఉన్నట్లు ఆలయ తనిఖీ అధికారి నవీన్ కుమార్ తెలిపారు. నేడు ఉదయం 7:30 గంటల నుంచి లడ్డూలు అందుబాటులో ఉంటాయన్నారు. ఒక్కో లడ్డూ రూ.50 చొప్పున విక్రయిస్తారన్నారు.
Similar News
News August 21, 2025
పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం: కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి

సహజ రంగులతో తయారు చేసిన మట్టి గణేష్ విగ్రహాలను వాడి వాటిని ప్రోత్సహించాలని, పర్యావరణ పరిరక్షణకు మన వంతు బాధ్యతగా చేయూతను అందిద్దామని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. వినాయక చవితి విశిష్ట తను కాపాడేందుకు మనమందరం సమిష్ఠిగా కృషిచేయడం వల్ల ఒక గొప్ప మార్పును సాధించవచ్చన్నారు. సహజ రంగులతో మట్టి విగ్రహాలను తయారు చేయడం స్వచ్ఛతకు చిహ్నమన్నారు.
News August 21, 2025
మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్ఠిద్దాం: JC

పర్యావరణం పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అన్నారు. DYFI ఆధ్వర్యంలో ‘మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్ఠిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం’ అనే పోస్టర్ను గురువారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు.
News August 21, 2025
కడప: ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

కడపలో ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రవేశాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు ఆగస్టు 26 వరకు ఉందని ప్రన్సిపల్ రత్నరాజు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈనెల 26న సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 8555958200 నంబర్కు సంప్రదించవచ్చని సూచించారు.