News August 21, 2025
రూ.85 వేల జీతంలో 750 బ్యాంక్ ఉద్యోగాలు

పంజాబ్&సింధ్ బ్యాంక్ 750 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీలో 80, తెలంగాణలో 50 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చదివి వయసు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయసు సడలింపు ఉంటుంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు ఉంటుంది. సెప్టెంబర్ 4లోగా <
Similar News
News August 21, 2025
BREAKING: సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ

AP: గ్రామ, వార్డు సచివాలయల్లో 2,778 డిప్యుటేషన్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 1,785 గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా 993 కొత్త పోస్టులను మంజూరు చేసింది. చింతూరు CHCని 100 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేసేందుకు అంగీకరించింది. వీటితో పాటు నాలా పన్ను 4 శాతంలో 70శాతం స్థానిక సంస్థలకు, 30శాతం అథారిటీలకు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు.
News August 21, 2025
పంచాయతీరాజ్ శాఖలో రేపటి నుంచి పనుల జాతర

TG: పంచాయతీరాజ్ శాఖలో రేపటి నుంచి పనుల జాతర మొదలవుతుందని మంత్రి సీతక్క తెలిపారు. పనుల జాతర పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. రూ.2,198 కోట్ల విలువైన 1.01 లక్షల పనులు శుక్రవారం నుంచి ప్రారంభం అవుతాయన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్లు, పొలాలకు మట్టి రోడ్లు, చెక్డ్యామ్లు, అంతర్గత సీసీ రోడ్లు, వాటర్ షెడ్లు, పశువుల కొట్టాలు, నర్సరీల పెంపకం, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, తదితర పనులు చేపడతామన్నారు.
News August 21, 2025
ఆసియా కప్లో యథావిధిగా భారత్-పాక్ మ్యాచ్లు!

భారత్-పాక్ మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్లు/స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. మన క్రీడాకారులు పాక్లో గానీ, వాళ్ల ప్లేయర్లు భారత్లో గానీ ఎలాంటి ఈవెంట్స్లో పాల్గొనరని చెప్పింది. అయితే ఇంటర్నేషనల్ ఈవెంట్స్కు సంబంధించి న్యూట్రల్ వేదికల్లో ఇరు దేశాలు తలపడేందుకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఆసియా కప్ UAEలో జరగబోతోంది. అంటే ఇందులో IND-PAK మధ్య పోరు ఉంటుందని స్పష్టమవుతోంది.