News August 21, 2025

గోదావరి ఉద్ధృతికి అప్రమత్తంగా ఉండండి: ఖమ్మం MP

image

భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి పెరిగి.. రెండో ప్రమాద హెచ్చరిక అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి సూచించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ఉన్న ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం గోదావరి నీటిమట్టం 50 అడుగులకు చేరిందన్న విషయం తెలుసుకొని జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు.

Similar News

News August 22, 2025

HYD: సెప్టెంబరు నుంచి 100 రోజుల అక్షరాస్యత ఉద్యమం

image

సెప్టెంబరు నుంచి100 రోజులపాటు అక్షరాస్యత ఉద్యమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ ఉద్యమం ప్రారంభం కానుంది. 15 ఏళ్ల వయసు దాటిన వారి కోసం ప్రత్యేకంగా 16 పాఠాలు ముద్రించి, అక్షర వికాసం కోసం ప్రభుత్వం కృషి చేయనుందని అధికారులు తెలిపారు.

News August 22, 2025

కూకట్‌పల్లి: సహస్ర హత్య.. పోలీసుల అదుపులో బాలుడు

image

సహస్ర హత్య కేసులో పక్క భవనంలో ఉన్న బాలుడే ఈ దారుణానికి వడిగట్టినట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే బాలుడిని అదుపులోకి తీసుకున్న ప్రత్యేక బృందాలు విచారణ చేపట్టారు. హత్య జరిగిన కూతవేటు దూరంలో ఉన్న పాఠశాలల్లోనే ఆ బాలుడు చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాలుడిని విచారణ చేయడంలో భాగంగా అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలను విచారణ అనంతరం తెలియజేస్తామని తెలిపారు.

News August 22, 2025

ఏలూరు జిల్లాలో బీజేపీ నేతలకు కీలక పదవులు

image

ఏలూరు జిల్లాకు చెందిన ఇద్దరు బీజేపీ నేతలకు పార్టీలో కీలక పదవులు లభించాయి. ఏలూరు నగరానికి చెందిన గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడిగా, కొయ్యలగూడెంకు చెందిన బొల్లిన నిర్మల కిషోర్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ అధిష్ఠానం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.