News August 21, 2025

హజ్‌ యాత్రకు HYD నుంచి 2,210 మంది ఎంపిక

image

హజ్‌ యాత్రకు నగరం నుంచి 2,210 మంది ఎంపికయ్యారని రాష్ట్ర హజ్‌ కమిటీ ఛైర్మన్‌ సయ్యద్‌ ఆఫ్జల్‌ బియబానీ ఖుస్రో పాషా తెలిపారు. తెలంగాణ నుంచి మొత్తం 4,292 మందిని డ్రా పద్ధతిలో ఎంపిక చేశామన్నారు. 11,757 మంది అప్లై చేసుకోగా వీరిని డ్రా పద్ధతిలో ఎంపిక చేశామన్నారు. మరింత సమాచారం కోసం హజ్‌ కమిటీ కార్యాలయంలో సంప్రదించాలని ఈ సందర్భంగా సూచించారు.

Similar News

News August 21, 2025

HYD: BJPకి బుద్ధి చెప్పండి: CPI నారాయణ

image

స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగ బద్ద సంస్థలను BJP ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసి, అధికారాన్ని కేంద్రీకృతం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తుందని CPI జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గాజుల రామారం మహారాజా గార్డెన్స్‌లో జరుగుతోన్న CPI మహాసభల్లో 2వ రోజు పాల్గొని, ప్రసంగించారు. BJP ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని నారాయణ పిలుపునిచ్చారు.

News August 21, 2025

HYD: ఎవడ్రా నువ్ KTR: గజ్జెల కాంతం

image

TPCC ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం ఈరోజు గాంధీభవన్‌లో మాట్లాడారు. ‘దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది కాంగ్రెస్.. అంత గొప్ప పార్టీని థర్డ్ క్లాస్ పార్టీ అంటావా ఎవడ్రా నువ్ KTR.. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే నీ అయ్య KCR ఈ జన్మలో CM కాకపోతుండే, నువ్ మంత్రి కాకపోతుండే.. థర్డ్ క్లాస్ నా కొడుకులు మీరు.. నీ అయ్య చీప్ లిక్కర్ తాక్కుంటా పండి, తాగుబోతు పార్టీ పెట్టిండు.. నీ అయ్య చరిత్ర తెలుసుకో’ అని అన్నారు.

News August 21, 2025

HYD: ఇంటర్ అడ్మిషన్లకు ఆగస్టు 31 వరకు అవకాశం

image

2025-26 విద్యా సంవత్సరంలో ఇంకా ఇంటర్‌లో చేరని విద్యార్థులకు బోర్డు గుడ్ న్యూస్ ప్రకటించింది. ఈ నెల 31లోపు తమకు నచ్చిన కళాశాలల్లో అడ్మిషన్ తీసుకోవచ్చని పేర్కొంది. ఆయా కళాశాలల ప్రిన్సిపళ్లు విద్యార్థులకు సహకరించాలని కోరింది. ఇదిలా ఉండగా జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ తీసుకునే సమయంలో సంబంధిత కాలేజీకి బోర్డు గుర్తింపు ఉందో, లేదో పరిశీలించాలని తల్లిదండ్రులకు సూచించింది.