News August 21, 2025

రోహిత్ తర్వాత వన్డే కెప్టెన్‌గా శ్రేయస్?

image

సీనియర్ కెప్టెన్ రోహిత్ స్థానంలో వన్డే కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌‌ను నియమించే యోచనలో BCCI ఉన్నట్లు జాతీయ మీడియా తెలిపింది. వచ్చే WCను దృష్టిలో పెట్టుకొని, సుదీర్ఘ ప్రయోజనాల దృష్ట్యా అయ్యర్‌కే కెప్టెన్సీ ఇచ్చే ఛాన్స్ ఉందని వెల్లడించింది. అటు టెస్టులు, T20లకు గిల్‌ను కెప్టెన్‌గా నియమించే అవకాశముంది. ఈ క్రమంలో గిల్‌కు పనిభారం కాకూడదని అయ్యర్‌కు వన్డే పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నట్లు పేర్కొంది.

Similar News

News August 21, 2025

BREAKING: సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ

image

AP: గ్రామ, వార్డు సచివాలయల్లో 2,778 డిప్యుటేషన్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 1,785 గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా 993 కొత్త పోస్టులను మంజూరు చేసింది. చింతూరు CHCని 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసేందుకు అంగీకరించింది. వీటితో పాటు నాలా పన్ను 4 శాతంలో 70శాతం స్థానిక సంస్థలకు, 30శాతం అథారిటీలకు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు.

News August 21, 2025

పంచాయతీరాజ్ శాఖలో రేపటి నుంచి పనుల జాతర

image

TG: పంచాయతీరాజ్ శాఖలో రేపటి నుంచి పనుల జాతర మొదలవుతుందని మంత్రి సీతక్క తెలిపారు. పనుల జాతర పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. రూ.2,198 కోట్ల విలువైన 1.01 లక్షల పనులు శుక్రవారం నుంచి ప్రారంభం అవుతాయన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్లు, పొలాలకు మట్టి రోడ్లు, చెక్‌డ్యామ్‌లు, అంతర్గత సీసీ రోడ్లు, వాటర్ షెడ్లు, పశువుల కొట్టాలు, నర్సరీల పెంపకం, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, తదితర పనులు చేపడతామన్నారు.

News August 21, 2025

ఆసియా కప్‌లో యథావిధిగా భారత్-పాక్ మ్యాచ్‌లు!

image

భారత్-పాక్ మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు/స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. మన క్రీడాకారులు పాక్‌లో గానీ, వాళ్ల ప్లేయర్లు భారత్‌లో గానీ ఎలాంటి ఈవెంట్స్‌లో పాల్గొనరని చెప్పింది. అయితే ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌కు సంబంధించి న్యూట్రల్ వేదికల్లో ఇరు దేశాలు తలపడేందుకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఆసియా కప్‌ UAEలో జరగబోతోంది. అంటే ఇందులో IND-PAK మధ్య పోరు ఉంటుందని స్పష్టమవుతోంది.