News August 21, 2025
మిడ్ మానేరులో కొనసాగుతున్న ఇన్ఫ్లో

బోయినపల్లి మండలం మన్వాడ వద్దగల శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి నీటితో పాటు, మూలవాగు, మానేరు ద్వారా నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 17,152 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఇందులో ఎస్సారెస్పీ నుంచి వరద కాలువ ద్వారా 13,802, గాయత్రి పంప్ హౌస్ నుంచి 3,150, మూలవాగు, మానేరు వాగు ద్వారా 200 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
Similar News
News March 21, 2026
తెనాలి: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ మృతి

పురుగుల మందు ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. తెనాలి మండలం నందివెలుగు గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి(48) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. వైద్యశాల నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ ఆనంద్ కేసు నమోదు చేశారు.
News March 21, 2026
గ్యాస్ కొరత లేదు.. ఆందోళన వద్దు: మంత్రి నాదెండ్ల

రాష్ట్రంలో గ్యాస్ కొరత అపోహలపై మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. గ్యాస్ కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటి వరకు 2.96 లక్షల బుకింగ్స్ రాగా 2.78 లక్షల డెలివరీలు పూర్తి చేసినట్లు చెప్పారు. సోషల్ మీడియా రూమర్స్ వల్లే అధిక బుకింగ్స్ జరుగుతున్నాయని, 26న విశాఖకు LPG నౌక చేరుకుంటుందని సరఫరా మరింత మెరుగవుతుందన్నారు. గ్యాస్ దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
News March 21, 2026
మార్కాపురం కలెక్టర్గా విజయ సునీత

మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్గా ఎం.విజయ సునీత నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్గా పని చేస్తున్నారు. త్వరలోనే మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు తీసుకోనున్నారు. జిల్లా ఏర్పడిన తర్వాత మొదటి మహిళా కలెక్టర్గా ఆమె ఈ ఘనత సాధించనున్నారు.


