News August 21, 2025
సోషల్ మీడియాకు దూరంగా ఉండండి: కలెక్టర్

విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. సావిత్రమ్మ డిగ్రీ కళాశాలలో హాస్టల్ నిర్మాణానికి ఆయన గురువారం భూమిపూజ చేశారు. తల్లితండ్రుల కలను నెరవేర్చడమే విద్యార్థుల లక్ష్యమన్నారు. ఓ టార్గెట్ పెట్టుకుని దానిని సాధించడానికి కృషి చేయాలని సూచించారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ.. విద్యపై చేసే ఖర్చు ఎప్పటికీ వృథా కాదన్నారు.
Similar News
News April 9, 2026
చిత్తూరు: ఆరెంజ్ జోన్లో రెండు మండలాలు

బుధవారం అత్యధికంగా నగరిలో 42.1, గంగవరంలో 40.8 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రెండు మండలాలు ఆరెంజ్ జోన్లోకి వెళ్లాయి. పలమనేరులో 40.5, నిండ్రలో 39.7, శ్రీరంగరాజపురం, విజయపురంలో 39.8, వెదురుకుప్పం, పులిచెర్లలో 39.5, రొంపిచెర్లలో 39.3, చిత్తూరు అర్బన్, చిత్తూరు రూరల్లో 39.1, గుడిపాలలో 38.9, పూతలపట్టులో 38.6, పాలసముద్రం, పెద్దపంజాణి, పెనుమూరు, యాదమరి(M)లో 38.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది.
News April 8, 2026
చిత్తూరు జిల్లాలో అదనంగా కోర్టులు.. కొత్త ఉద్యోగాలు!

APలో కొత్తగా 96 కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా చిత్తూరు జిల్లాలో 6 కోర్టులు రానున్నాయి. చిత్తూరులో 7వ అదనపు జూనియర్ సివిల్ కోర్టు, మదనపల్లెలో మూడో అదనపు సివిల్ కోర్టు, పలమనేరులో మొదటి అదనపు సివిల్ కోర్టు, రెండో అదనపు సివిల్ కోర్టు, పుంగనూరులో రెండో అదనపు సివిల్ జడ్జి కోర్టు, వాయల్పాడులో మొదటి అదనపు సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు కానుంది. వీటితో కొత్త ఉద్యోగాలు వస్తాయి.
News April 8, 2026
చిత్తూరు: 18 మండలాల్లో 40 డిగ్రీలు

చిత్తూరు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. 18 మండలాల్లో మంగళవారం నలభై డిగ్రీలకుపై ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎస్ఆర్ పురం 42.6, నగరి 42.4, విజయపురం 41.7, పలమనేరు 41.3, గంగవరం 40.9 డిగ్రీలు నమోదు అయింది. చిత్తూరు 41.8, గుడిపాల, తవణంపల్లె, బంగారు పాళ్యంలో 41.3, పూతలపట్టు, శాంతిపురం 41, గంగాధర నెల్లూరు 40.9, పెద్ద పంజాణి 40.6, పాలసముద్రం, పెనుమూరు, యాదమరిలో 40.2, ఐరాలలో 40 డిగ్రీల ఎండ కాసింది.


