News August 21, 2025

సిద్దిపేట: విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి: మంత్రి పొన్నం

image

బీసీ గురుకుల పాఠశాలలు, బీసీ హాస్టల్‌లలో తాజా పరిస్థితులపై మంత్రి పొన్నం ప్రభాకర్ టెలికాన్ఫరెన్స్‌లో గురువారం పాల్గొన్నారు. భారీ వర్షాలు కురవడంతో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని గురుకుల పాఠశాలలు, హాస్టల్ లలో విద్యార్థుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని పాఠశాలల ప్రిన్సిపల్స్, వార్డెన్‌లకు ఆదేశించారు. విద్యార్థులకు విధిగా సిబ్బంది ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు.

Similar News

News March 6, 2026

కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయంటే!

image

కామారెడ్డి జిల్లాలో ఆయా ప్రాంతాల్లో గడచిన 24 గంటల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు(ఎల్లో అలెర్ట్) నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. ఎల్పుగొండ 38.1°C, సోమూరు, భిక్కనూరు 38, సదాశివనగర్, కొల్లూరు 37.7, నాగిరెడ్డిపేట, మాచాపూర్ 37.6, బీర్కూరు 37.5, దోమకొండ 37.4, మేనూరు, బీబీపేట 37.1, లచ్చపేట 37, డోంగ్లి 36.9, ఆర్గొండ, పుల్కల్ 36.8, బిచ్కుంద, పాతరాజంపేట 36.7, బొమ్మన్ దేవిపల్లి 36.6°C ల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News March 6, 2026

అమరావతిలో ‘నైలిట్’ కేంద్రం ఏర్పాటు

image

అమరావతిలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ (నైలిట్) కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలిపింది. నైలిట్ ప్రతినిధులు డా.జయరాజ్, డా.లక్ష్మణ్ కొర్రా ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ముందుగా తాత్కాలిక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రం ద్వారా యువతకు ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగాల్లో డిజిటల్ నైపుణ్యాలు, మెరుగైన శిక్షణ అందుబాటులోకి రానున్నాయి

News March 6, 2026

KMR: ఎండలు మండుతున్నాయి.. జాగ్రత్తలు అత్యావశ్యకం

image

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. పది రోజులుగా ప్రతిరోజు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఓవైపు ప్రజలు పెళ్లిళ్ల జోరుతో ఏసీ ఫంక్షన్ హాల్ లను వినియోగించుకుంటుండగా, మరోవైపు పలు మండల కేంద్రాలలో చలివేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. నిన్న 37.9°C ఉష్ణోగ్రత నమోదు అవ్వడంతో, ఎండ నుంచి ఉపశమనం పొందాలని, ప్రతి రోజు 4 నుంచి 5 లీటర్ల నీరు సేవించాలని వైద్యులు సూచిస్తున్నారు.