News August 21, 2025

రోజువారీ ఆహారంలో ఈ ఫుడ్స్ యాడ్ చేయండి!

image

మనం తీసుకునే ఆహారంలో కొన్నింటిని జోడించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ‘సజ్జలు తీసుకుంటే పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. మామిడిపండ్లు తింటే కిడ్నీల్లోని రాళ్లు కరుగుతాయి. దానిమ్మ రసం కామెర్ల నివారణకు ఔషధంగా పనిచేస్తుంది. ఆవాలు క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ పెరుగుతుంది. అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గించి మలబద్ధకాన్ని వదిలిస్తుంది’ అని పేర్కొన్నారు. SHARE IT.

Similar News

News March 21, 2026

కుప్పకూలిన ధరలు.. టమాటా రైతుల కన్నీళ్లు

image

AP: గిట్టుబాటు ధర లభించక టమాటా రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. అనంతపురం(D) కక్కలపల్లి మార్కెట్‌లో నిన్న KG ధర గరిష్ఠంగా ₹7, కనిష్ఠంగా ₹3, సగటున ₹5 మాత్రమే పలికింది. అన్నమయ్య జిల్లాలో కోత ఖర్చులూ రాకపోవడంతో అన్నదాతలు పంటను పశువులకు వదిలేశారు. శ్రీకాకుళం(D)లోని పలు గ్రామాల్లో 27 KGల ట్రే ధర ₹70-90కి పడిపోయింది. వ్యాపారులు మాత్రం KG ₹20-30కి విక్రయిస్తుండటం గమనార్హం. మీ ఏరియాలో టమాటా రేటు ఎలా ఉంది?

News March 21, 2026

పాక్‌ క్రికెట్‌లో టాక్సిక్ వర్క్ కల్చర్: గ్యారీ కిర్‌స్టెన్

image

పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ తీవ్ర విమర్శలు చేశారు. బోర్డులో ఇతరుల జోక్యం, టాక్సిక్ వర్క్ కల్చర్ ఉంటుందని చెప్పారు. ఇలాంటి పరిస్థితిని తానెక్కడా చూడలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్‌కు కోచింగ్ సిబ్బందిని బలిపశువులను చేస్తారన్నారు. వృత్తిపరమైన గౌరవం లేకపోవడంతో రిజైన్ చేసినట్లు తెలిపారు. కాగా ఆయన APR 15న శ్రీలంక కోచ్‌గా బాధ్యతలు <<19339760>>చేపట్టనున్నారు.<<>>

News March 21, 2026

రాష్ట్రాలకు అదనంగా 20% కమర్షియల్ గ్యాస్

image

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కేంద్రం శుభవార్త చెప్పింది. రాష్ట్రాలకు అదనంగా మరో 20% కమర్షియల్ గ్యాస్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈనెల 23 నుంచి ఇది అమలులోకి రానుంది. ఇటీవల కేంద్రం అనౌన్స్ చేసిన 10% గ్యాస్‌కు ఇది అదనం. హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలకు గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్రం పేర్కొంది.