News August 21, 2025
KNR: వృద్ధులపై కఠినంగా బిడ్డలు

పింఛన్, ఆస్తి.. కారణమేదైనా మలిదశలో తల్లిదండ్రులను కాదనే ప్రభుద్ధులెందరో ఉమ్మడి KNRలో ఇప్పటికీ ఉన్నారు. కొన్నినెలల క్రితం JGTL(D)వెల్గటూర్, రాయికల్, కోరుట్లల్లో వివిధకారణాలతో బిడ్డల నుంచి భరోసా కరవై వృద్ధులు రోడ్డెక్కారు. తాజాగా KNR(D)శంకరపట్నం మొలంగూర్లో ఓ కొడుకు<<17470521>> తల్లిని బయటకు గెంటేసి<<>> ఇంటికి తాళమేసుకున్నాడు. ఇలాంటి బాధితులు RDOలు, పోలీసులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ అధికారులను కలిసి న్యాయం పొందొచ్చు.
Similar News
News August 21, 2025
రాజమండ్రి: ఎక్కడా ఇసుక కొరత లేదు: కలెక్టర్

తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక కొరత ఎక్కడా లేదని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. వర్షాలు, గోదావరి వరదల కారణంగా ఎక్కడ ఇసుక కొరత లేకుండా స్టాక్ పాయింట్ల వద్ద సరిపడా ఇసుకను అందుబాటులో ఉంచామన్నారు. ఇసుక కోసం ప్రజలు, కాంట్రాక్టర్లు, గృహ నిర్మాణాలు చేపట్టే వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.
News August 21, 2025
BREAKING: రాష్ట్రంలో విషాదం

AP: ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషాద ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. రాజంపేట(మం) బాలరాజుపల్లిలో చెయ్యేరు నదిలో 8 మంది విద్యార్థులు ఈతకు వెళ్లగా, ముగ్గురు ఇసుక ఊబిలో చిక్కుకుని చనిపోయారు. మృతులు స్థానిక కాలేజీలో MBA చదువుతున్న దిలీప్, చంద్రశేఖర్, కేశవగా గుర్తించారు. నిన్న కర్నూలు (D) ఆస్పరి (M) చిగిలిలో నీటి కుంటలో ఈతకు వెళ్లిన <<17465047>>ఆరుగురు <<>>చిన్నారులు మృతిచెందారు.
News August 21, 2025
ఎన్టీఆర్: B.A.LL.B పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలోని కళాశాలల్లో B.A.LL.B కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ (రెగ్యులేషన్ 2018, 2023) థియరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. సెప్టెంబర్ 16, 18, 20, 23వ తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వర్శిటీ పరిధిలోని కాలేజీలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని అధ్యాపకులు తెలిపారు. పూర్తి వివరాలకు https://kru.ac.in/ చూడాలని కోరారు.