News August 21, 2025

భోజనం రుచిగా ఉండాలి: కలెక్టర్

image

రాజమండ్రిలోని అన్న క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్, కమిషనర్ పి. ప్రశాంతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె అక్కడికి వచ్చిన ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆహార నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ ఉండకూడదని, భోజనం రుచిగా ఉండాలని నిర్వాహకులకు సూచించారు. మెనూ ప్రకారం భోజన పదార్థాలు ఉండేలా చూడాలని, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులను, సిబ్బందిని ఆదేశించారు.

Similar News

News March 24, 2026

మెగా ఫ్యామిలీ నుంచి స్పెషల్ పిలుపు.. బాబికి కీలక పదవి

image

రాజమండ్రికి చెందిన ఏడిద బాబి Mega Youth Force జాతీయ కన్వీనర్‌గా నియమితులయ్యారు. సోమవారం హైదరాబాద్‌లో ప్రొడ్యూసర్ కొణిదెల సుస్మిత నుంచి ఆయన నియామక పత్రం అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని బాబి వెల్లడించారు. తనపై ఉంచిన నమ్మకానికి నూరు శాతం న్యాయం చేస్తానని పేర్కొన్నారు. రాజమండ్రి నుంచి జాతీయ స్థాయి గుర్తింపు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

News March 23, 2026

పోలీస్ PGRSకు ఫిర్యాదుల వెల్లువ

image

తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం PGRS కార్యక్రమాన్ని SP డి.నరసింహ కిషోర్ నిర్వహించారు. బాధితుల నుంచి 47 ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, చట్ట పరిధిలో త్వరితగతిన సమస్యలను పరిష్కరించి సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యమని ఈ సందర్భంగా SP స్పష్టం చేశారు.

News March 23, 2026

దొమ్మేటి జయంతి.. SP నరసింహ కిషోర్ నివాళి

image

తూర్పుగోదావరి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం శెట్టిబలిజ పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు జరిగాయి. SP నరసింహ కిషోర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభివృద్ధికి, విద్యకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. దొమ్మేటి సేవలను గుర్తించి ప్రభుత్వం ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిందని SP పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.