News August 21, 2025

సిరిసిల్ల: ’నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి’

image

గణేష్ మండపాల నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బీ గీతే అన్నారు. సిరిసిల్లలోని SP కార్యాలయంలో గురువారం ప్రకటన విడుదల చేశారు. మండపాలు ప్రజా రవాణా, ఎమర్జెన్సీ వాహనాలకు ఇబ్బందులేకుండా ఏర్పాటు చేసుకోవాలన్నారు. విద్యుత్ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. మండపాల నిర్వాహకుల బాధ్యత వహించే వారి ఫోన్ నెంబర్లు మండపాలలో ఏర్పాటు చేయాలన్నారు. CC కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.

Similar News

News August 21, 2025

NLG: హర్పాల్ సింగ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

image

ఎస్ఎల్‌బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేయడానికి ఇరిగేషన్ శాఖ సలహాదారుడిగా మాజీ లెఫ్ట్‌నెంట్ జనరల్ హర్పాల్ సింగ్‌ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. డిఫెన్స్ ఇంజినీరింగ్ విభాగంలో 40 ఏళ్ల అనుభం కలిగిన ఆయన రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. ఎలాంటి జీతభత్యాలు తీసుకోకుండా ఆయన సేవలందిస్తారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ అభ్యర్థన మేరకు తెలంగాణలో పనిచేయడానికి ఆయన అంగీకరించారు.

News August 21, 2025

చైనాను నమ్మొచ్చా?

image

అమెరికా టారిఫ్స్‌కు వ్యతిరేకంగా <<17476240>>భారత్-చైనా<<>> దగ్గరవుతున్నాయి. తమ దేశంలో వస్తువులను అమ్ముకోవచ్చని చైనా ఆహ్వానించింది. అయితే చైనాను అంత తేలిగ్గా నమ్మవద్దని అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం. అమెరికాను దాటి ప్రపంచ నం.1 అయ్యేందుకు చైనా ఏమైనా చేస్తుందని, ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ పాక్‌కు సపోర్ట్ చేసిందని గుర్తు చేస్తున్నారు. అయితే చైనాతో సఖ్యతతో ఉంటూనే USను దూరం చేసుకోవద్దంటున్నారు. దీనిపై మీ COMMENT?

News August 21, 2025

సామరస్యంగా నవరాత్రులు నిర్వహించాలి: యాదాద్రి కలెక్టర్

image

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గణేశ్ నవరాత్రుల ఏర్పాట్ల కోసం ఈరోజు కలెక్టర్ హనుమంతరావు సమావేశం నిర్వహించారు. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, కమిటీ సభ్యులతో గణేశ్ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. గతంలో కంటే వైభవంగా ఉత్సవాలు నిర్వహించాలని, శాంతియుతంగా, సామరస్యంగా నవరాత్రులు నిర్వహించాలని కోరారు.