News August 21, 2025
ఆసియా కప్లో యథావిధిగా భారత్-పాక్ మ్యాచ్లు!

భారత్-పాక్ మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్లు/స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. మన క్రీడాకారులు పాక్లో గానీ, వాళ్ల ప్లేయర్లు భారత్లో గానీ ఎలాంటి ఈవెంట్స్లో పాల్గొనరని చెప్పింది. అయితే ఇంటర్నేషనల్ ఈవెంట్స్కు సంబంధించి న్యూట్రల్ వేదికల్లో ఇరు దేశాలు తలపడేందుకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఆసియా కప్ UAEలో జరగబోతోంది. అంటే ఇందులో IND-PAK మధ్య పోరు ఉంటుందని స్పష్టమవుతోంది.
Similar News
News August 21, 2025
ఏపీఎం టెర్మినల్స్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం

AP: పోర్టుల అభివృద్ధి, సౌకర్యాలపై APM టెర్మినల్స్ సంస్థతో CM చంద్రబాబు సమక్షంలో ఏపీ మారిటైం బోర్డు ఒప్పందం చేసుకుంది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల్లో ₹9వేల కోట్లతో టెర్మినల్స్, కార్గో హ్యాండ్లింగ్ వ్యవస్థలను ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది. దీని వల్ల దాదాపు 10,000 మందికి ఉపాధి లభించనుంది. APని తూర్పు దేశాలకు సముద్ర ద్వారంగా, లాజిస్టిక్స్ హబ్గా మార్చడానికి కట్టుబడినట్లు CM పేర్కొన్నారు.
News August 21, 2025
వివాదానికి శుభం కార్డు.. రేపటి నుంచి షూటింగ్లు షురూ!

ప్రభుత్వ జోక్యంతో టాలీవుడ్ <<17429585>>ప్రొడ్యూసర్లు-ఫెడరేషన్<<>> మధ్య వివాదం సద్దుమణిగింది. దీంతో 18 రోజుల విరామం తర్వాత రేపటి నుంచి సినిమా షూటింగ్లు ప్రారంభం కానున్నాయి. కండీషన్లు, డిమాండ్లపై కాసేపట్లో ప్రకటన విడుదల కానుంది. ప్రభుత్వ జోక్యంతో లేబర్ కమిషన్ రంగంలోకి దిగి చర్చలు జరిపింది.
News August 21, 2025
రేపు ఫలితాలు విడుదల

AP: రేపు DSC మెరిట్ <<17459141>>లిస్ట్ <<>>విడుదల చేయనున్నట్లు కన్వీనర్ కృష్ణారెడ్డి వెల్లడించారు. DSC సైటుతో పాటు జిల్లా విద్యాధికారి సైటులోనూ ఫలితాలు చూసుకోవచ్చన్నారు. అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో వివిధ కేటగిరీల పోస్టుల కాల్ లెటర్ పొందవచ్చని సూచించారు. లిస్టులో ఉన్న వారంతా ఒరిజినల్ సర్టిఫికెట్లు, గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన 3 సెట్ల జిరాక్సులు, 5 పాస్ పోర్టు ఫొటోలతో వెరిఫికేషన్కు హాజరుకావాలని తెలిపారు.