News August 21, 2025
పాలమూరు అభివృద్దే లక్ష్యం

పాలమూరు పార్లమెంట్ అభివృద్దే ధ్యేయంగా పాలమూరు ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అడుగులు వేశారు. స్థానిక సమస్యలపై ఢిల్లీలో కేంద్ర మంత్రులు, మంత్రి శాఖల ముఖ్య కార్యదర్శులతో వరుస భేటీ అయ్యారు. గురువారం ఢిల్లీలో పార్లమెంట్ భవనంలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శిని తారాజీని కలిశారు. పలు మున్సిపాలిటీల అభివృద్ధి, ఇప్పటికే ఇచ్చిన ప్రతిపాదనలపై కీలక చర్చలు జరిపారు.
Similar News
News March 12, 2026
రాజాపూర్: రోడ్డు ప్రమాదంలో చెన్నవెళ్లి యువకుడు మృతి

రాజాపూర్ మండల పరిధిలోని చెన్నవెళ్లికి చెందిన చిలివేరి నరేశ్ గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. నరేశ్ రాజాపూర్ నుంచి షాద్నగర్ వైపు వెళ్తుండగా అతని బైక్, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో నరేశ్ అక్కడికక్కడే మృతి చెందారు. షాద్నగర్ సమీపంలోని ఓ పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న నరేశ్ మృతి పట్ల చెన్నవెల్లిలో విషాదఛాయలు అలముకొన్నాయి.
News March 11, 2026
MBNR : పదో తరగతి పరీక్షలు.. ఫోన్ వాడితే ఉద్యోగం ఊస్ట్!

మహబూబ్నగర్ జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ అధికారులు కఠిన ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎవరినీ మొబైల్ ఫోన్లతో అనుమతించకూడదని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలు అతిక్రమించి ఫోన్ వాడుతూ పట్టుబడితే, వారిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగిస్తామని అధికారులు హెచ్చరించారు.
News March 11, 2026
దేవరకద్రలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేవరకద్రలో అత్యధికంగా 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గండీడు (36.0), భూత్పూర్ (35.7), కోయిలకొండ (35.6) మండలాల్లోనూ ఎండ ప్రభావం అధికంగా ఉంది. చిన్నచింతకుంట, అడ్డాకుల, నవాబుపేట ప్రాంతాల్లో 34 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చిలోనే ఎండలు ముదురుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.


