News August 21, 2025

గంజాయి కేసులో ఇద్దరు గుంటూరు వ్యక్తులు అరెస్ట్

image

గంజాయి తరలిస్తూ విశాఖపట్నం (D) కంచరపాలెం పోలీసులకు గుంటూరు(D)కు చెందిన ఇద్దరు పట్టుబడ్డారు. వీరిలో ఓ యువతి కూడా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. ఈనెల 12న సుభాష్ నగర్ వద్ద కారు ఢీకొని ఏడాదిన్నర చిన్నారి మృతిచెంది. పోలీసులు కారు సీజ్ చేశాక తనిఖీ చేస్తున్న సమయంలో 21 కిలోలు గంజాయి కారులో గుర్తించారు. కేసు నమోదు చేసి గుంటూరు జిల్లాకు చెందిన అక్షయ గౌతమి, బాపట్లకు చెందిన మహమ్మద్ జాకీర్‌ను అరెస్ట్ చేశారు.

Similar News

News April 4, 2026

అమరావతికి కొత్త రైల్వే లైన్లు

image

హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైలు అమరావతి మీదుగా వెళ్లనుంది. పశ్చిమ బైపాస్, ఎన్-6 రోడ్డు గుండా దీని డ్రాఫ్ట్ సిద్ధమైంది. మరో వైపు ఎర్రుపాలెం-నంబూరు మధ్య రూ.2245 కోట్లతో 57 కి.మీ మేర కొత్త రైల్వే లైన్ నిర్మించనున్నారు. ఇందులో కృష్ణా నదిపై 3 కి.మీ వంతెన ఉంటుంది. ఈ లైన్ ద్వారా ప్రధాన నగరాలకు అమరావతి అనుసంధానం అవుతుంది. దీనికి సంబంధించి 4 నెలల్లో భూసమీకరణ పూర్తి చేయనున్నారు.

News April 3, 2026

గుంటూరు డివిజన్‌లో ఇక రెగ్యులర్‌గా ప్రత్యేక రైళ్లు

image

గుంటూరు రైల్వే డివిజన్ మీదుగా నడిచే పలు ప్రత్యేక రైళ్లకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రత్యేక రైళ్లను రెగ్యులర్ రైళ్లుగా మార్చేందుకు అధికారికంగా ఆమోదం తెలిపింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రైళ్లు ఎప్పటి నుంచి రెగ్యులర్‌గా నడుస్తాయనే తేదీలను త్వరలో వెల్లడించనున్నారు. దీనిపై దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు త్వరలో ప్రకటన చేయనున్నారు.

News April 2, 2026

గుంటూరులో మండిపోనున్న ఎండలు

image

పసిఫిక్ మహాసముద్రంలో మే నెలలో ఎల్ నినో పరిస్థితులు ఏర్పడనున్నాయి. దీనివల్ల 2026 వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. కోస్తా ఆంధ్రాలోని గుంటూరులో సాధారణం కంటే ఎండలు దంచికొట్టనున్నాయి. వేడి వాతావరణం మరింత పెరగనుంది. ఈ ఎల్‌నినో ప్రభావం ప్రారంభ రుతుపవనాలపై పడనుంది. అయితే అడపాదడపా ప్రీ-మాన్సూన్ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుంటూరు ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.