News April 1, 2024
1.26 లక్షల మంది సచివాలయం సిబ్బంది ఉన్నారు కదా: CBN

AP: రాజకీయ ప్రయోజనాల కోసం కావాలనే పెన్షన్లను ఆపేయడం దారుణమని చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక జగన్ 15 రోజుల్లో రూ.13వేల కోట్లు కాంట్రాక్టర్లకు దోచి పెట్టారు. అలాంటిది పెన్షన్ ఇవ్వడానికి అడ్డేమొచ్చింది? ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయనుకుంటే.. 1వ తేదీ ఇంటి వద్దనే పెన్షన్ ఎందుకు అందించలేదు? వాలంటీర్లను ఈసీ వద్దంటే 1.26 లక్షల మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు కదా’ అని పేర్కొన్నారు.
Similar News
News February 9, 2026
మార్చి 31న సెలవు రద్దు: RBI

మార్చి 31(మహావీర్ జయంతి)న బ్యాంకుల సెలవు రద్దు చేస్తూ RBI ఆదేశాలు జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం హాలీడే ఉన్నా ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఆ రోజున పనివేళలు కొనసాగించాలని తెలిపింది. 2025-26 FYలోపే ప్రభుత్వ రసీదులు, చెల్లింపులకు సంబంధించి ట్రాన్సాక్షన్లు జరిగినట్లు పరిగణనలోకి తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొంది. సాధారణ కార్యకలపాలపై కస్టమర్లు బ్రాంచ్ను ధ్రువీకరించుకోవడం ఉత్తమం.
News February 9, 2026
డ్రైవర్ నిర్లక్ష్యం.. 30 మంది మృతి

నైజీరియాలోని కానోలో ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 30 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. గాయపడినవారిని సమీపంలో ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కాగా ఈ దేశంలో రోడ్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, ట్రాఫిక్ చట్టాలు అమలు చేయడంలో వైఫల్యం వల్ల తరచుగా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి.
News February 9, 2026
ప్రభాస్ ‘స్పిరిట్’ నుంచి తప్పుకున్న నటుడు!

సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘స్పిరిట్’ మూవీ నుంచి నటుడు ప్రకాశ్ రాజ్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా సినిమా నుంచి ఆయన వైదొలిగినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతకుముందు దీపికా పదుకొణే తప్పుకోగా ఆమె స్థానంలో హీరోయిన్గా తృప్తి దిమ్రిని తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 5న విడుదల కానుంది.


